SSMB29: సెట్లోకి అప్పుడే!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్‌బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు.

Updated : 03 May 2024 09:49 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్‌బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘మహేశ్‌ - రాజమౌళి కాంబినేషన్‌ను 15ఏళ్ల క్రితమే సెట్‌ చేశా. ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్‌ మరోస్థాయిలో ఉంది. అయినా సరే వాళ్లు ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు. నిజానికి రాజమౌళికి హాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ, వాటిని కాదనుకుని నా కోసం సినిమా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తన పాత్రకు తగ్గట్లుగా మహేశ్‌ తనని తాను మలుచుకుంటున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రీకరణ మొదలు కావొచ్చు. కథ చాలా బాగుంది. దీంట్లో ఆఫ్రికన్‌ నేపథ్యముంది. బడ్జెట్‌ ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ ప్రాజెక్ట్‌కు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టేందుకు సిద్ధం’’ అని నిర్మాత కె.ఎల్‌.నారాయణ చెప్పుకొచ్చారు. ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని