మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్, పోస్టర్లతో సినీప్రియులను ఆకట్టుకున్న ఈ సినిమా ఈ నెల 6న ఈటీవీ విన్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకురాలు మ్రితికా ఈనాడు సినిమాతో ముచ్చటించారు.
అసలు ఈ సినిమా ఎలా మొదలైంది?
ఓ నిర్మాత కుమార్తె అయిన నా స్నేహితురాలు నన్ను ఈటీవీకి పరిచయం చేశారు. ఎన్నో చర్చల తరవాత ఈటీవీ బృందానికి నా స్క్రిప్ట్ నచ్చి దర్శకురాలిగా నాకు అవకాశం ఇచ్చారు.
ఈ చిత్రంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అంశాలేంటి?
‘‘మూఢనమ్మకాలు లేని దెయ్యం సినిమా ఇది. మతపరమైన ఆచారాలు లేని భయానక చిత్రం. అన్ని రకాల ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హారర్ చిత్రమిది. ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ ప్రాముఖ్యత గురించి తెలుపుతుంది. ఇందులో ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలను చూపించలేదు. సినిమాలో హీరోహీరోయిన్లు ఎలాంటి నమ్మకాలు, ఆచారాలు లేని ఒక హేతువాద జంట. ఇందులో దెయ్యం తలకిందులుగా వేలాడడం, భయానకమైన నవ్వులు, ఒంట్లో వణుకు పుట్టించే చీకటి..లాంటి ఆసక్తికర అంశాలు ప్రేక్షకులకు ఎంతో థ్రిల్ను పంచుతాయి. ద్వితీయార్ధంలో మన మూలాలు, ఆచార సంప్రదాయాల గురించి చూపించాము’’.
మహిళా దర్శకుల సంఖ్య పరిమితంగా ఉన్న తరుణంలో మీరు దర్శకత్వం వైపు రావడం మంచి పరిణామం. సినిమాల్లోకి మీ ప్రయాణం ఎలా మొదలైంది?
‘‘మా అమ్మమ్మ నన్ను విఠలాచార్య తీసిన ‘గంధర్వ కన్య’ సినిమా తమిళ వెర్షన్కి తీసుకెళ్లడంతో నా సినిమాల ప్రయాణం మొదలైంది. నా జీవితంలో చాలా మంచి క్షణాలు నేను ఎంతో ప్రేమించే మనుషులతో కలిసి గొప్ప సినిమాలు చూడటంతోనే గడిచిపోయాయి. అలా చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. కృషి, చిత్తశుద్ధి లాంటి మనలో ఉన్న నైపుణ్యాలే పెట్టుబడి అయినప్పుడు ఎంత సమయం పట్టినా మనం కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము. ఈ విధంగా నేను అనుకున్న గమ్యానికి కొంచెం ఆలస్యమైనా చేరుకున్నాను. కచ్చితంగా ఇది నాకు ఒక మంచి పరిణామం అనుకుంటున్నాను. 2010లో నేను దర్శకుడు క్రిష్ సర్ దగ్గర ‘వానం’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. ఆయన రూపొందించిన ‘వేదం’ రీమేక్ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్సిటీలో జరిగింది. ఇదే నా మొదటి అవుట్డోర్ లొకేషన్. ఇప్పుడు ఈటీవీ నుంచే నా తొలి చిత్రం రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది’’.
ఈ చిత్రంలోని పాత్రల గురించి చెప్పండి?
‘‘ఈ సినిమాలో దివ్య నవీన్ అనే పాత్రలో రితికా సింగ్ కనిపిస్తుంది. ఆమె భర్త కెప్టెన్ నవీన్ నాయుడు పాత్రను శ్రీరామ్ పోషించారు. నవీన్ నాయుడు ఇండియన్ నేవీ కెప్టెన్. చాలా సార్లు ఉద్యోగం పని మీద బయటికి వెళ్తాడు. కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అతను తన భార్య, కొడుకు కోసం సమయాన్ని వెచ్చిస్తాడు. వీళ్ల కుమారుడే మాధన్న. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేక విషయం ఉంది. మన నేటివీటికి కట్టుబడి.. ఇందులో పిల్లలకు పేర్లు పెట్టడంలో మన చరిత్రను కదిలించాలని నిర్ణయించుకున్నాను. అందుకే మన మూలాలను గుర్తు చేసేలా సినిమాలో పాత్రల పేర్లు పెట్టాను. ఈ సినిమాలో పాత్రలే కాకుండా కథను ముందుకు నడిపించే ప్రధాన పాత్రలో వళరి, ప్రసాదిని, ఐరన్ లాకర్ లాంటి కొన్ని అంశాలు కూడా ఉంటాయి. మీరు ఈ సినిమా చూసినప్పుడు వీటన్నింటి గురించి తెలుసుకుంటారు’’.
ఈ సినిమాని ఓటీటీలోనే విడుదల చేయడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయి?
‘‘కచ్చితంగా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ప్రేక్షకుల సమయాన్ని, ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాము. అంతేకాకుండా ఓటీటీ కారణంగా కుటుంబంతో గడుపుతూ సినిమాని చూసే ఓ గొప్ప అవకాశం మన ముందు ఉంది. అందుకే ఈటీవీ విన్ వేదికగా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’.
దర్శకురాలిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి?
‘‘ప్రస్తుతం నా పూర్తి ధ్యాస అంతా ‘వళరి’ సినిమా మీదనే. ఇది విడుదలయ్యే వరకూ ఏ సినిమా గురించి చర్చించను. మా నిర్మాత, చిత్రబృందం ‘వళరి’ సినిమా విడుదలైన రోజు గర్వంగా నవ్వడం చూసిన తర్వాత నా తదుపరి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాను’’.
సినిమా పేరుతోనే ఆసక్తి రేకెత్తిస్తున్నారు... ఇంతకీ ‘వళరి’ అంటే ఏంటి?
‘వళరి’ అనేది తమిళ ప్రజల పదునైన ఆయుధం. దీన్ని ఎంత దూరం నుంచి విసిరినా విపరీతమైన వేగంతో దూసుకుపోతుంది. 1801లో బ్రిటిష్ వారు వళరి ఆయుధాల వినియోగాన్ని నిషేధిస్తూ ఆయుధ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లోనే ఈ ఆయుధాల్ని సుమారు 15000 వరకు జప్తు చేశారు. కొన్ని బ్రిటిష్ మ్యూజియంలకు పంపించారు. తెలుగు, హిందీ, తమిళ సినిమాలకి మన భాష కాని ఇంగ్లీషు పదాల పేర్లు పెట్టినప్పుడు.. తెలుగు సినిమాకి భారతీయ భాషలో ఉన్న తమిళ పదాన్ని ఎందుకు పెట్టకూడదనే ఆలోచన వచ్చింది. అందుకే ‘వళరి’ అని పేరు పెట్టాను. మన ఏం చేసినా కర్మ మనల్ని వదిలి పెట్టదనే కథాంశంతో రూపొందించాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం