Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
హైదరాబాద్: ప్రతినాయకుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం కథానాయకుడిగా రాణిస్తున్నారు హీరో గోపీచంద్ (Gopichand). విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఎ. హర్ష దర్శకత్వంలో ‘భీమా’(Bhimaa) చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
భీమా ప్రయాణం ఎలా మొదలైంది? ఇంతకు ముందు పోలీస్ పాత్రలు చేశారు. వాటికీ, ఈ సినిమాకీ తేడా ఏంటి?
కో ప్రొడ్యూసర్ శ్రీధర్, హర్షను పరిచయం చేయడంతో ఆయన్ని ఒక పోలీస్ స్టోరీ కావాలని అడిగాను. ఆయన భీమా స్టోరీ చెప్పారు. ఇందులో ఉన్న సెమీ ఫాంటసీ ఎలిమెంట్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇంతకుముందు నేను చేసిన ‘గోలీమార్’ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఉంటే, ‘ఆంధ్రుడు’ ప్రేమపై డిపెండై ఉంటుంది. కానీ భీమా పూర్తిగా పోలీస్ స్టోరీ. ఇందులో ఉన్న రెండు క్యారెక్టర్స్ కథపై ఆధారపడి ఉంటాయి. భీమా పాత్ర నాకు బాగా నచ్చింది. రాక్షసుడిని చంపే బ్రహ్మరాక్షసుడు భీమా. సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఇది పూర్తిగా కమర్షియల్ మూవీ. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి.
ఈ సినిమాతో హిట్ కొట్టే అవకాశం ఉందా? మీ తర్వాత కథను ఎంపిక చేసుకోవడంలో ఈ సినిమాల ప్రభావం ఉంటుందా?
హిట్ కొట్టాలనే అందరం సినిమాలు చేస్తాం. చేసినవన్నీ విజయం సాధిస్తాయని చెప్పలేం కదా. అది థియేటర్కి వచ్చే ఆడియన్స్పై ఆధారపడి ఉంటుంది. కథ, చిత్రీకరణ టైమ్లో బాగానే చేశాం అనుకుంటాం. కానీ సినిమా చూశాక ఎక్కడ మనం తప్పు చేశామో తెలుస్తుంది. తర్వాత చేయబోయే చిత్రాల్లో ఆ పొరపాట్లు రాకుండా చూసుకుంటా. ‘రామబాణం’ ప్రెజెంటేషన్ లోపం కారణంగా హిట్ అవలేదు. కానీ భీమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.
ఈ సినిమా ‘అఖండ’లా ఉంది అంటున్నారు. ప్రస్తుతం కమర్షియల్ మూవీస్ హిట్ అవడం లేదు. దీనిపై మీ అభిప్రాయం?
అఘోరాలు ఉన్నారని ‘అఖండ’తో పోల్చుతున్నారు. కానీ ఈ చిత్రం అలా ఉండదు. పరశురామ క్షేత్రాన్ని బ్యాక్డ్రాప్లో తీసుకుని చేశాం. ఇది కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎంత యాక్షన్ ఉన్నా, ఎమోషన్ లేనిదే సినిమా హిట్ అవదు.
‘ఒంటరి’, ‘ఒక్కడున్నాడు’ లాంటి సినిమాలు మళ్లీ చేసే అవకాశం ఉందా?
అలాంటి జోనర్లో ఒక కథ కుదిరింది. త్వరలోనే సినిమా చేస్తా. ప్రేక్షకులు ఇప్పటికీ ‘సాహసం’ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే వరుస సినిమాలు చేస్తున్నా. కథ బాగున్నా, దానిని తెరకెక్కించేటప్పుడు ఇబ్బంది ఎదరవుతుంది. అలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి.
ఈ సినిమాలో ఎద్దును చూసి మీకు ఎలా అనిపించింది? ప్రస్తుతం మీరు కామెడీ సినిమాలు చేయడం లేదు ఎందుకు?
అందరూ గుర్రాలు ఉపయోగిస్తుంటే మీరేంటి ఎద్దుని వాడుతున్నారని డైరెక్టర్ని అడిగాను. ‘భీమా పాత్ర చాలా బలమైనది నేను ఇలానే ఊహించుకుని కథ రాశాను’ అన్నారు. దాంతో సరే అన్నాను. అవుట్పుట్ చూశాక బాగా తీశారు అనిపించింది. కామెడీ జోనర్లో సినిమాలు చేయాలని ఉన్నా అన్ని సందర్భాల్లో అది కుదరదు. ‘లౌక్యం’ సూపర్ హిట్ అయితే, ‘సౌఖ్యం’ ఫ్లాప్ అయింది. ఎందుకంటే కామెడీ కొంతవరకే బాగుంటుంది. భీమాలో యాక్షన్తో పాటు, కామెడీ కూడా ఉంటుంది.
ప్రస్తుతం తెలుగు కథలు రావటం లేదు. ఎందుకంటారు?
మా నాన్న కాలంలో ఉన్న రచయితలు ప్రజలతో ఉండి, వారి నుంచి కథలను ఎంచుకునేవారు. ఇప్పుడున్న వారు అలా కాదు. చాలా తక్కువమంది అలా ఉంటున్నారు. ప్రజల సమస్యలు కరెక్ట్గా చెప్పగలిగితే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. నా వద్దకు అలాంటి కథలు వస్తే కచ్చితంగా చేస్తా.
దర్శకత్వం కానీ, ప్రభాస్తో సినిమా చేసే ఆలోచనలు కానీ ఉన్నాయా?
నటించడం కంటే దర్శకత్వం వహించడం చాలా కష్టం. డైరెక్టర్కి అన్ని విషయాలపై అవగాహన ఉండాలి. నేపథ్య సంగీతం ఎలా ఉండాలో తెలుసుండాలి. నటుడిగానే కొనసాగుతాను. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనుంది. ప్రభాస్తో కలిసి నటించాలని అనుకుంటున్నాం. టైమ్ వస్తే ఇద్దరం మరో సినిమా చేస్తాం. ప్రస్తుతానికి శ్రీనూవైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. ఆయన మార్క్తోపాటు కథ బాగుందని ఈ ప్రాజెక్ట్ అంగీకరించాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ