Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
హైదరాబాద్: ప్రతినాయకుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం కథానాయకుడిగా రాణిస్తున్నారు హీరో గోపీచంద్ (Gopichand). విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఎ. హర్ష దర్శకత్వంలో ‘భీమా’(Bhimaa) చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
భీమా ప్రయాణం ఎలా మొదలైంది? ఇంతకు ముందు పోలీస్ పాత్రలు చేశారు. వాటికీ, ఈ సినిమాకీ తేడా ఏంటి?
కో ప్రొడ్యూసర్ శ్రీధర్, హర్షను పరిచయం చేయడంతో ఆయన్ని ఒక పోలీస్ స్టోరీ కావాలని అడిగాను. ఆయన భీమా స్టోరీ చెప్పారు. ఇందులో ఉన్న సెమీ ఫాంటసీ ఎలిమెంట్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశాను. ఇంతకుముందు నేను చేసిన ‘గోలీమార్’ గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఉంటే, ‘ఆంధ్రుడు’ ప్రేమపై డిపెండై ఉంటుంది. కానీ భీమా పూర్తిగా పోలీస్ స్టోరీ. ఇందులో ఉన్న రెండు క్యారెక్టర్స్ కథపై ఆధారపడి ఉంటాయి. భీమా పాత్ర నాకు బాగా నచ్చింది. రాక్షసుడిని చంపే బ్రహ్మరాక్షసుడు భీమా. సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఇది పూర్తిగా కమర్షియల్ మూవీ. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి.
ఈ సినిమాతో హిట్ కొట్టే అవకాశం ఉందా? మీ తర్వాత కథను ఎంపిక చేసుకోవడంలో ఈ సినిమాల ప్రభావం ఉంటుందా?
హిట్ కొట్టాలనే అందరం సినిమాలు చేస్తాం. చేసినవన్నీ విజయం సాధిస్తాయని చెప్పలేం కదా. అది థియేటర్కి వచ్చే ఆడియన్స్పై ఆధారపడి ఉంటుంది. కథ, చిత్రీకరణ టైమ్లో బాగానే చేశాం అనుకుంటాం. కానీ సినిమా చూశాక ఎక్కడ మనం తప్పు చేశామో తెలుస్తుంది. తర్వాత చేయబోయే చిత్రాల్లో ఆ పొరపాట్లు రాకుండా చూసుకుంటా. ‘రామబాణం’ ప్రెజెంటేషన్ లోపం కారణంగా హిట్ అవలేదు. కానీ భీమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.
ఈ సినిమా ‘అఖండ’లా ఉంది అంటున్నారు. ప్రస్తుతం కమర్షియల్ మూవీస్ హిట్ అవడం లేదు. దీనిపై మీ అభిప్రాయం?
అఘోరాలు ఉన్నారని ‘అఖండ’తో పోల్చుతున్నారు. కానీ ఈ చిత్రం అలా ఉండదు. పరశురామ క్షేత్రాన్ని బ్యాక్డ్రాప్లో తీసుకుని చేశాం. ఇది కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎంత యాక్షన్ ఉన్నా, ఎమోషన్ లేనిదే సినిమా హిట్ అవదు.
‘ఒంటరి’, ‘ఒక్కడున్నాడు’ లాంటి సినిమాలు మళ్లీ చేసే అవకాశం ఉందా?
అలాంటి జోనర్లో ఒక కథ కుదిరింది. త్వరలోనే సినిమా చేస్తా. ప్రేక్షకులు ఇప్పటికీ ‘సాహసం’ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతోనే వరుస సినిమాలు చేస్తున్నా. కథ బాగున్నా, దానిని తెరకెక్కించేటప్పుడు ఇబ్బంది ఎదరవుతుంది. అలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి.
ఈ సినిమాలో ఎద్దును చూసి మీకు ఎలా అనిపించింది? ప్రస్తుతం మీరు కామెడీ సినిమాలు చేయడం లేదు ఎందుకు?
అందరూ గుర్రాలు ఉపయోగిస్తుంటే మీరేంటి ఎద్దుని వాడుతున్నారని డైరెక్టర్ని అడిగాను. ‘భీమా పాత్ర చాలా బలమైనది నేను ఇలానే ఊహించుకుని కథ రాశాను’ అన్నారు. దాంతో సరే అన్నాను. అవుట్పుట్ చూశాక బాగా తీశారు అనిపించింది. కామెడీ జోనర్లో సినిమాలు చేయాలని ఉన్నా అన్ని సందర్భాల్లో అది కుదరదు. ‘లౌక్యం’ సూపర్ హిట్ అయితే, ‘సౌఖ్యం’ ఫ్లాప్ అయింది. ఎందుకంటే కామెడీ కొంతవరకే బాగుంటుంది. భీమాలో యాక్షన్తో పాటు, కామెడీ కూడా ఉంటుంది.
ప్రస్తుతం తెలుగు కథలు రావటం లేదు. ఎందుకంటారు?
మా నాన్న కాలంలో ఉన్న రచయితలు ప్రజలతో ఉండి, వారి నుంచి కథలను ఎంచుకునేవారు. ఇప్పుడున్న వారు అలా కాదు. చాలా తక్కువమంది అలా ఉంటున్నారు. ప్రజల సమస్యలు కరెక్ట్గా చెప్పగలిగితే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. నా వద్దకు అలాంటి కథలు వస్తే కచ్చితంగా చేస్తా.
దర్శకత్వం కానీ, ప్రభాస్తో సినిమా చేసే ఆలోచనలు కానీ ఉన్నాయా?
నటించడం కంటే దర్శకత్వం వహించడం చాలా కష్టం. డైరెక్టర్కి అన్ని విషయాలపై అవగాహన ఉండాలి. నేపథ్య సంగీతం ఎలా ఉండాలో తెలుసుండాలి. నటుడిగానే కొనసాగుతాను. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనుంది. ప్రభాస్తో కలిసి నటించాలని అనుకుంటున్నాం. టైమ్ వస్తే ఇద్దరం మరో సినిమా చేస్తాం. ప్రస్తుతానికి శ్రీనూవైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. ఆయన మార్క్తోపాటు కథ బాగుందని ఈ ప్రాజెక్ట్ అంగీకరించాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ