Kangana: అమితాబ్‌ తర్వాత మీరే..

‘కేజీయఫ్ - 2‌’ విజయంపై నటి కంగనా రనౌత్‌ హర్షం వ్యక్తం చేశారు. యశ్‌ని మెచ్చుకుంటూ ఆమె తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టారు. ఎంతోకాలం నుంచి భారతీయ చలన చిత్రపరిశ్రమపై ఇలాంటి నటుడ్ని చూసేందుక....

Published : 18 Apr 2022 02:06 IST

ముంబయి: ‘కేజీయఫ్ - 2‌’ విజయంపై నటి కంగనా రనౌత్‌ హర్షం వ్యక్తం చేశారు. యశ్‌ని మెచ్చుకుంటూ ఆమె తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టారు. ఎంతోకాలం నుంచి భారతీయ చలన చిత్రపరిశ్రమపై ఇలాంటి నటుడ్ని చూసేందుకు సినీ ప్రియులందరూ వేచి చూస్తున్నారని ఆమె అన్నారు. ‘‘ఎన్నో దశాబ్దాల నుంచి భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఇలాంటి యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ కోసమే ఎదురుచూస్తోంది. అమితాబ్‌ తర్వాత 70ల కాలం నుంచి ఏర్పడిన శూన్యాన్ని ఇతను భర్తీ చేశాడు. అద్భుతం’’ అని కంగన పేర్కొన్నారు. అనంతరం మరో పోస్ట్‌లో దక్షిణాది హీరోలైన యశ్‌, రామ్‌చరణ్‌, తారక్‌, అల్లు అర్జున్‌ని కంగన మెచ్చుకున్నారు. ‘‘టాలెంట్‌, హార్డ్‌వర్క్‌తోపాటు ఎక్కడైనా, ఎవరితోనైనా కలిసిపోయే లక్షణం, సంప్రదాయాలకు దక్షిణాది హీరోలు ఇచ్చే విలువే.. వారిని అభిమానులకు మరింత చేరువ చేసింది’’ అని ఆమె తెలిపారు. కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో ‘కేజీయఫ్‌’ రూపుదిద్దుకుంది. ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రాఖీబాయ్‌గా యశ్‌ అదరగొట్టేశారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. బాలీవుడ్‌ నటీనటులు సంజయ్‌దత్‌, రవీనాటాండన్‌ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా తొలిరోజే రూ.134 కోట్ల గ్రాస్‌ సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని