ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది.
వాహనమిత్ర’ పేరుతో జగనన్న మాయ
ఆ చేత్తో ఇస్తూ...ఈ చేత్తో పన్నుల వాత!
ఇష్టానుసార జరిమానాలతో ఆటో డ్రైవర్ల కుదేలు
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. రూ.పదివేలు వద్దు మమ్మల్ని బతకనివ్వండంటూ వేడుకోని ఆటో డ్రైవర్ లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
ఈనాడు, విశాఖపట్నం
గతంలోరోజంతా ఆటో నడిపి ఇంటిలో కొంత డబ్బులు ఇచ్చి.. మిగిలినదాంతో రుణం తీర్చేవారు. ఇప్పుడు పన్నుల భారం భరించలేక ఇంట్లో ఇవ్వడానికి డబ్బులు చాలక నానా అగచాట్లు పడుతున్నారు. జగన్ పాలనలో పది రూపాయలు ఇచ్చి రూ.వంద పిండేశారు. జిల్లాలో 50 వేలకుపైగా ఆటోలు ఉంటే సగం మందికి పైగా డ్రైవర్లు అప్పులపాలయ్యారు.
- ఆటో డ్రైవర్లకు అయిదేళ్లలో రూ.50 వేల చొప్పున సాయం చేసిన వైకాపా ప్రభుత్వం పన్నులు, జరిమానాల రూపంలో ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష పైచిలుకు లాగేసిందంటే ఆశ్చర్యపోక తప్పదు. గాజువాకలో ఓ లబ్ధిదారుడు అయిదేళ్లలో రూ.50 వేల సాయం అందుకుంటే పన్నులు, వివిధ రకాల జరిమానాలు మొత్తం రూ.లక్ష పైగా చెల్లించి చితికిపోయాడు.
- ఆటో డ్రైవర్లను ఆదుకుంటున్నట్లు చెబుతున్న వైకాపా ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టింది. అద్దె ఆటోలు నడిపే వారికి సాయం మంజూరు చేయలేదు. యజమానులైనా.. చిన్నపాటి పత్రాలు సమర్పించకపోయినా కోత విధించేశారు. జిల్లాలో ఆటోలు దాదాపు 55,446 ఉన్నాయి. మొదటి ఏడాదిలో 32,778 మందికి వాహనమిత్ర కింద రూ.10 వేల చొప్పున అందజేయగా.. తర్వాత ఏడాది అదనంగా 5,223 మందికి అందజేసి ఆ తర్వాత మూడేళ్లు భారీగా కోత పెట్టారు. 2022-23 నాటికి ఈ కోత సంఖ్య 17 వేలకు చేరింది. 2023-24లో దాదాపు 1400 మందిని కొత్తగా జాబితాలో చేర్చి ఏదో ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకున్నారు.
ఇలా కుదేలు: గత తెదేపా హయాంలో జరిమానాలు చాలా తక్కువ. వైకాపా వచ్చాక ఆ రకమైన కేసులు భారీగా పెరిగాయి. గతంలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.130 జరిమానా ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.1,000కి పెంచారు. చిన్నచిన్న వాటికి అపరాధ రుసుములు చెల్లించాలని రవాణాశాఖ, పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. నో పార్కింగు అని, పరిమితికి మించి ఎక్కించుకున్నారని, నెంబరు ప్లేటు సరిగా లేదని, కాలుష్య ధ్రువీకరణ ఇతర కారణాలను అడ్డం పెట్టుకొని ముక్కు పిండి మరీ వసూలు చేశారు. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఆటోలను ఆపి మరీ పెండింగు చలాన్లను తనిఖీ చేసి కట్టించుకున్నారు. డబ్బులు లేవు మళ్లీ చెల్లిస్తామన్నా కరుణ చూపలేదు. ఏదైనా కారణంతో రహదారి మధ్యలో ఆపితే చాలు బాదుడే బాదుడు. జగన్ సర్కారు విధించిన పన్నుల భారం భరించలేక చాలా మంది విసిగిపోయారు.
జిల్లాలోని ఆటోలు: 55,446
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
జగన్ ఏలుబడిలో... అంగన్వాడీల అగచాట్లు
[ 07-05-2024]
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. -
ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల
[ 07-05-2024]
ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
వైకాపా హయాంలో..అన్నీ నేరాలే!
[ 07-05-2024]
వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ విమర్శించారు. -
మూడు పార్టీల కూటమితోనే ఉత్తరాంధ్ర ప్రగతి
[ 07-05-2024]
‘యువత సైకిల్ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
సమస్యల్లో పరవాడ ‘మేజర్’
[ 07-05-2024]
పరవాడ మేజర్ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. -
శిశువులపై జగన్ కర్కశత్వం
[ 07-05-2024]
జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. -
చీకట్లో పోలింగ్ కేంద్రాలు.. కనిపించని గుర్తులు
[ 07-05-2024]
ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. -
పింఛన్ లబ్ధిదారులకు తీరని అవస్థలు
[ 07-05-2024]
పింఛన్ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి. -
మాజీ పోలీసు ఇంట్లో రూ.9.99 లక్షలు స్వాధీనం
[ 07-05-2024]
జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎస్టీ) స్వాధీనం చేసుకుంది. -
చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు
[ 07-05-2024]
ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్ సూచించారు. -
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
[ 07-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!