DNS : గోవాలో నాగార్జున చిత్రం

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమాలో నాగార్జున, ధనుష్‌ కథానాయకులుగా నటిస్తున్నారు.

Updated : 05 Feb 2024 09:17 IST

ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమాలో నాగార్జున, ధనుష్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఇటీవలే ప్రారంభమైన చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తిరుపతిలో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. సోమవారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్‌ మొదలవుతోంది. నాగార్జున, ధనుష్‌ ఇద్దరూ అక్కడ జరిగే చిత్రీకరణలో పాల్గొననున్నారు. ముంబయి మాఫియా నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ‘లవ్‌స్టోరి’ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిదే. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని