Nagarjuna: ‘‘12 ఏళ్ల వయసులో ప్రేమలో పడతాం... తర్వాత 15 ఏళ్లు కలుసుకోం’’
‘నా సామిరంగ’ ప్రమోషన్లో భాగంగా నాగార్జున విలేకర్లతో మాట్లాడారు.
‘నా సామిరంగ’ (Naa Saamiranga)తో అలరించడానికి సిద్ధమయ్యారు అగ్ర కథానాయకుడు నాగార్జున. ఆయన హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) కథానాయిక. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. సంక్రాంతి పురస్కరించుకొని ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగార్జున విలేకర్లతో ముచ్చటించారు.
మూడు నెలల్లో సినిమాను ఎలా పూర్తి చేశారు?
నాగార్జున: షూటింగ్కు మూడు నెలల సమయం పట్టింది. ప్రీ ప్రొడక్షన్ పనులు 5 నెలలు చేశాం. నా పార్ట్ 60 రోజుల్లో పూర్తి చేశారు. సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటే తప్పులు ఎక్కువవుతాయి. అలాంటివి జరగకుండా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎక్కువ రోజులు చేశాం. ఇది పెద్ద సినిమా. చాలా పాత్రలున్నాయి. ఇంత త్వరగా పూర్తి చేయడానికి కీరవాణి ప్రధాన కారణం. పాటలు, నేపథ్య సంగీతం అన్నీ షూట్కు ముందే కంపోజ్ చేశారు.
ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి?
నాగార్జున: స్నేహం, ప్రేమ, త్యాగం, ద్వేషం.. ఈ నాలుగు అంశాలు నచ్చాయి. ఇవి కథకు మూల స్తంభాలు. ఇది పూర్తిస్థాయి రీమేక్ చిత్రం కాదు. మాతృకలోని నాలుగు అంశాలను తీసుకుని ఇక్కడి ప్రేక్షకులకు తగినట్లు మార్పులు చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో జరిగే కథ. అందుకే సంక్రాంతికి విడుదల చేస్తున్నాం.
మామూలు వాటి కంటే రీమేక్ సినిమాలు చేయడం కష్టమా?
నాగార్జున: మాతృకలో ఉన్న సోల్ కనిపించేలా సినిమా తీయాలి. ఇక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేయాలి. దీనికి సంబంధించిన పూర్తి క్రెడిట్ దర్శకుడు విజయ్ బిన్నీకే దక్కాలి. ఈ స్క్రిప్ట్ను ఎంతోమందికి చూపించి సలహాలు తీసుకున్నారు. ప్రసన్న కూడా డైలాగ్లు బాగా రాశారు.
అషికా రంగనాథ్తో చేయడం ఎలా అనిపించింది?
నాగార్జున: మా ఇద్దరి కాంబినేషన్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మేమిద్దరం 12 ఏళ్లు ఉన్నప్పుడే ప్రేమలో పడతాం. ఆ తర్వాత 15ఏళ్లు కలుసుకోం. చాలా భిన్నమైన ప్రేమకథ.
ఈ సినిమా పాటల గురించి చెప్పండి?
నాగార్జున: ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. ప్రతి పాట ప్రత్యేకమైనదే. సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసేసరికి పాటలను విడుదల చేయడానికి కూడా మా వద్ద సమయం లేదు.
అల్లరి నరేశ్ పాత్రను ఎవరు ఎంపిక చేశారు?
నాగార్జున: అందరం కలిసి సెలెక్ట్ చేశాం. ఆ పాత్రకు అతడు కచ్చితంగా సరిపోతాడు.
‘నా సామిరంగ’ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
నాగార్జున: కథకు ఈ టైటిల్ కచ్చితంగా సరిపోతుంది. ఈ సినిమాలో నా ఊతపదం ఇది. అందుకే పెట్టాం. దీని రన్టైమ్ 2 గంటల 20 నిమిషాలు. మొత్తం 2 గంటల 35 నిమిషాలు షూట్ చేశాం. అందులో నుంచి పావుగంట కట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ప్రతి సీన్ ముఖ్యమైనదిగానే కనిపించింది.
ఎడిటింగ్ విషయంలో మీరేమైనా సలహాలిచ్చారా?
నాగార్జున: నాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులంటే ఆసక్తి ఎక్కువ. ఎడిటింగ్ జరిగాక సినిమా చూస్తాను. ఎక్కడైనా అవసరం అనుకుంటే సలహా ఇస్తానంతే. కచ్చితంగా మార్చాలని చెప్పను. అలా చెబితే వాళ్ల క్రియేటివిటీని మనం తక్కువ చేసినట్లవుతుంది.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయి?
నాగార్జున: కథకు అవసరం కాబట్టి ఇందులో చాలా రోజుల తర్వాత మాస్ లుక్లో కనిపిస్తున్నా. గతంలో నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలుంటాయి. సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. గత ఏడాది సెప్టెంబర్ 20న నాన్న విగ్రహావిష్కరణ జరిగింది. అదే రోజు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం.
వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయా?
నాగార్జున: సినిమాకు వెబ్సిరీస్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ‘దూత’ను సినిమాగా తీయలేరు. ఈ సిరీస్ కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డారు. నాకు అలాంటి కథ దొరికితే చేస్తాను.
తమిళ డైరెక్టర్ నవీన్తో తీస్తోన్న కథ ఎలా ఉంటుంది?
నాగార్జున: అదొక ప్రపంచం. షారుక్ ఖాన్ ‘పఠాన్’ను పోలి ఉంటుంది.
ప్రస్తుతం ఎన్ని ప్రాజెక్ట్లు చేస్తున్నారు?
నాగార్జున: శేఖర్ కమ్ముల, నవీన్ల దర్శకత్వంలో సినిమాలకు ఓకే చెప్పా.
సంక్రాంతి బరిలో పోటిపడటం ఎలా అనిపిస్తోంది?
నాగార్జున: మేము అనుకున్నన్ని థియేటర్లు దొరకలేదు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సమయంలోనూ ఇదే సమస్య. అప్పుడూ 300 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడూ అంతే.
మీ కుమారులతో కలిసి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారా?
నాగార్జున: ఇంకా ఏం అనుకోలేదు.
100వ సినిమా స్టార్ హీరోతో కలిసి తీసే అవకాశం ఉందా?
నాగార్జున: ల్యాండ్ మార్క్ సినిమాలు స్టార్ హీరోలతో కలిసి తీయాలని అనుకుంటే నా కెరీర్లో ‘శివ’, ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడతా’.. వచ్చేవి కావు.
మహేశ్తో కలిసి మల్టీస్టారర్ తీస్తారా?
నాగార్జున: గతంలో ఈ విషయంపై నేను పోస్ట్ పెట్టాను. ఇప్పుడు మహేశ్ బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఆలోచిద్దాం.
‘బ్రహ్మస్త్ర 2’ ఎప్పుడు ఉంటుంది?
నాగార్జున: అయాన్ ముఖర్జీ ప్రస్తుతం ‘వార్3’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అది అయ్యాక మొదలు పెట్టే అవకాశం ఉంది. నాకు రికార్డులు, వసూళ్లపై పెద్ద ఆసక్తి లేదు. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలనుకుంటాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య