Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి.
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. హాస్య ప్రధానమైన పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన... వైవిధ్యమైన నటనతో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఆయన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంలో నటించారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యు.వి.క్రియేషన్స్ సమర్పణలో... వి సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి విలేకర్లతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలివీ..
‘‘హాస్యం ప్రధానంగా సాగే కథ ఇది. ముగ్గురు స్నేహితుల్లో ఒకరైన వినయ్ గుమ్మాడి అనే పాత్రలో నేను కనిపిస్తా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ కోసం ముగ్గురూ చేరతారు. ఉచిత హాస్టల్ సౌకర్యం, ఉపకార వేతనం కోసమే తప్ప వీళ్లకి పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. ఇందులో నేను సైన్స్ని నమ్మే వ్యక్తిగా దాని గురించే మాట్లాడుతుంటా. మిగతా ఇద్దరేమో తంత్రాలు, మంత్రాల గురించి మాట్లాడుతుంటారు. ఈ కలయికలో పండే వినోదమే ఈ సినిమా. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత నేను, శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన చిత్రమిదే. ఎంత సరదాగా మా ప్రయాణం సాగిందో, అంతకుమించిన సరదాల్ని సినిమా పంచుతుంది’’.
- ‘‘దర్శకుడు శ్రీహర్ష తొలి చిత్రం ‘హుషారు’లోనే నేను నటించాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత ‘రౌడీబాయ్స్’ కోసం మళ్లీ మేం కలిశాం. కానీ ఆ తర్వాత మారిన తారాగణం వల్ల అప్పుడు కూడా నేనూ, శ్రీహర్ష కలిసి పనిచేయలేకపోయాం. మూడోసారి ఈ సినిమాతో కలిసి పనిచేశాం. ముగ్గురు స్నేహితుల ప్రయాణానికి తోడు, ఫాంటసీ, హారర్ ప్రపంచం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. మేం ఇదివరకు చేసిన ‘బ్రోచేవారెవరురా’ కానీ, ముగ్గురు స్నేహితులతోనే కలిసి తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమాతో కానీ ఈ సినిమాకి ఎలాంటి పోలిక ఉండదు. ఎలాంటి అసభ్యతకి చోటు లేకుండా సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు’’.
- ‘‘నటుడు పారే నదిలా ఉండాలి. ‘మల్లేశం’ తర్వాత నలభై మంది దర్శకులు నాకు కథలు చెప్పారు. కానీ వాటిలో ఎక్కడా నన్ను నేను చూసుకోలేకపోయా. దాంతో వెంటనే వెళ్లి ‘జాతిరత్నాలు’ చేశా. ఆ పాత్రని కాదనడానికి నాకు కారణమే దొరకలేదు. ‘మల్లేశం’ కథ కూడా ఆ సమయంలో నేనే వేరే చిత్రాల్లో సరదా పాత్రలేవో చేస్తున్నా. అప్పుడు ఈ కథ విన్నాక, ఇంతకంటే గొప్ప హీరో కథని ఎప్పుడూ చూడలేదనిపించి చేశా.
- ‘బలగం’ సినిమా కూడా అలాంటి అనుభవాన్నే ఇచ్చింది. ఓ గొప్ప పుస్తకం చదివాక అందులోని భావం, విలువలు మనతోపాటే ప్రయాణం చేస్తాయి కదా, అలా ఓ గొప్ప పుస్తకాన్ని చదివిన అనుభూతిని పంచాయి ఈ సినిమాలు. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. మనం చూసే సినిమాలూ మారాయి. అందుకు తగ్గట్టే ప్రయాణం చేయాలి. ప్రస్తుతం ¸గేమ్ ఛేంజర్’తోపాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నా. ప్రధాన పాత్రధారిగా కథానాయిక నభా నటేష్తో కలిసి ఓ సినిమా చేస్తున్నా’’.
- ‘‘స్నేహితుల చుట్టూ తిరిగే ఇలాంటి బడ్డీ కామెడీ కథలు చేస్తున్నప్పుడు నటులు, రచయితలు చాలా అప్రమత్తంగా ఉండాలి. యువతరం మాట్లాడుకునే భాష అందులో పక్కాగా వినిపించాలి. యువతరం మీమ్స్తో ముడిపెట్టి మాట్లాడుతుంటారు, ఆ సందర్భంలో వచ్చిన సినిమా సంభాషణలతో ముడిపెట్టి కబుర్లు చెప్పుకుంటుంటారు. వాటన్నిటినీ పసిగడుతూ ఓ నటుడిగా సెట్లో సంభాషణల్ని మెరుగుపరుచుకుంటూ పలుకుతుంటాం. అప్పుడే టార్గెట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాం. అలాగని అసభ్యకరమైన సంభాషణల జోలికి వెళ్లకూడదు.
- ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వచ్ఛమైన కామెడీతో సినిమా చేయడమనేది ఓ పెద్ద సవాల్. నటులుగా మేం కూడా ఇంతకంటే ఎక్కువ వెళ్లొద్దని హద్దులు పెట్టుకుంటుంటాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్