Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి.
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. హాస్య ప్రధానమైన పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన... వైవిధ్యమైన నటనతో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఆయన ‘ఓం భీమ్ బుష్’ చిత్రంలో నటించారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యు.వి.క్రియేషన్స్ సమర్పణలో... వి సెల్యులాయిడ్తో కలిసి సునీల్ బలుసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి విలేకర్లతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలివీ..
‘‘హాస్యం ప్రధానంగా సాగే కథ ఇది. ముగ్గురు స్నేహితుల్లో ఒకరైన వినయ్ గుమ్మాడి అనే పాత్రలో నేను కనిపిస్తా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ కోసం ముగ్గురూ చేరతారు. ఉచిత హాస్టల్ సౌకర్యం, ఉపకార వేతనం కోసమే తప్ప వీళ్లకి పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. ఇందులో నేను సైన్స్ని నమ్మే వ్యక్తిగా దాని గురించే మాట్లాడుతుంటా. మిగతా ఇద్దరేమో తంత్రాలు, మంత్రాల గురించి మాట్లాడుతుంటారు. ఈ కలయికలో పండే వినోదమే ఈ సినిమా. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత నేను, శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన చిత్రమిదే. ఎంత సరదాగా మా ప్రయాణం సాగిందో, అంతకుమించిన సరదాల్ని సినిమా పంచుతుంది’’.
- ‘‘దర్శకుడు శ్రీహర్ష తొలి చిత్రం ‘హుషారు’లోనే నేను నటించాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత ‘రౌడీబాయ్స్’ కోసం మళ్లీ మేం కలిశాం. కానీ ఆ తర్వాత మారిన తారాగణం వల్ల అప్పుడు కూడా నేనూ, శ్రీహర్ష కలిసి పనిచేయలేకపోయాం. మూడోసారి ఈ సినిమాతో కలిసి పనిచేశాం. ముగ్గురు స్నేహితుల ప్రయాణానికి తోడు, ఫాంటసీ, హారర్ ప్రపంచం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. మేం ఇదివరకు చేసిన ‘బ్రోచేవారెవరురా’ కానీ, ముగ్గురు స్నేహితులతోనే కలిసి తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమాతో కానీ ఈ సినిమాకి ఎలాంటి పోలిక ఉండదు. ఎలాంటి అసభ్యతకి చోటు లేకుండా సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు’’.
- ‘‘నటుడు పారే నదిలా ఉండాలి. ‘మల్లేశం’ తర్వాత నలభై మంది దర్శకులు నాకు కథలు చెప్పారు. కానీ వాటిలో ఎక్కడా నన్ను నేను చూసుకోలేకపోయా. దాంతో వెంటనే వెళ్లి ‘జాతిరత్నాలు’ చేశా. ఆ పాత్రని కాదనడానికి నాకు కారణమే దొరకలేదు. ‘మల్లేశం’ కథ కూడా ఆ సమయంలో నేనే వేరే చిత్రాల్లో సరదా పాత్రలేవో చేస్తున్నా. అప్పుడు ఈ కథ విన్నాక, ఇంతకంటే గొప్ప హీరో కథని ఎప్పుడూ చూడలేదనిపించి చేశా.
- ‘బలగం’ సినిమా కూడా అలాంటి అనుభవాన్నే ఇచ్చింది. ఓ గొప్ప పుస్తకం చదివాక అందులోని భావం, విలువలు మనతోపాటే ప్రయాణం చేస్తాయి కదా, అలా ఓ గొప్ప పుస్తకాన్ని చదివిన అనుభూతిని పంచాయి ఈ సినిమాలు. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. మనం చూసే సినిమాలూ మారాయి. అందుకు తగ్గట్టే ప్రయాణం చేయాలి. ప్రస్తుతం ¸గేమ్ ఛేంజర్’తోపాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నా. ప్రధాన పాత్రధారిగా కథానాయిక నభా నటేష్తో కలిసి ఓ సినిమా చేస్తున్నా’’.
- ‘‘స్నేహితుల చుట్టూ తిరిగే ఇలాంటి బడ్డీ కామెడీ కథలు చేస్తున్నప్పుడు నటులు, రచయితలు చాలా అప్రమత్తంగా ఉండాలి. యువతరం మాట్లాడుకునే భాష అందులో పక్కాగా వినిపించాలి. యువతరం మీమ్స్తో ముడిపెట్టి మాట్లాడుతుంటారు, ఆ సందర్భంలో వచ్చిన సినిమా సంభాషణలతో ముడిపెట్టి కబుర్లు చెప్పుకుంటుంటారు. వాటన్నిటినీ పసిగడుతూ ఓ నటుడిగా సెట్లో సంభాషణల్ని మెరుగుపరుచుకుంటూ పలుకుతుంటాం. అప్పుడే టార్గెట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాం. అలాగని అసభ్యకరమైన సంభాషణల జోలికి వెళ్లకూడదు.
- ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వచ్ఛమైన కామెడీతో సినిమా చేయడమనేది ఓ పెద్ద సవాల్. నటులుగా మేం కూడా ఇంతకంటే ఎక్కువ వెళ్లొద్దని హద్దులు పెట్టుకుంటుంటాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం