Rathika rose: టాప్-5లో ఉండే అర్హత నాకు లేదు.. నన్ను క్షమించండి: రతిక
Rathika rose Interview: బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన రతికా రోజ్ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
హైదరాబాద్: మొదటిసారితో పోలిస్తే, రెండోసారి బిగ్బాస్ హౌస్లోకి వెళ్లినప్పుడు తన ఆటతీరు పూర్తిగా డౌన్ అయిపోయిందని, ఎక్కువ ఒత్తిడి ఉన్న కారణంగా ఆడలేకపోయిన మాట వాస్తవమేనని రతిక (Rathika rose) చెప్పుకొచ్చింది. సీజన్-7లో రెండోసారి ఎలిమినేట్ అయిన ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.
వచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు!
‘‘గేమ్స్లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ప్రేక్షకులు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేనూ ప్రయత్నించా. యాక్టివిటీల పరంగా చిన్నప్పటి నుంచి వీక్. రెండోసారి అవకాశం వస్తే, సరిగా వినియోగించుకోలేకపోయా. ఆ విషయాన్ని అంగీకరిస్తా. మొదటిసారి ఎలిమినేట్ అయినప్పుడు శివాజీ, ప్రశాంత్లను కనీసం చూడకుండా బయటకు రావడానికి కారణం ఉంది. నేను ఎలిమినేట్ అయ్యానన్న ప్రకటన రాగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏ మాట్లాడాలో కూడా కొద్దిసేపు తెలియలేదు. బయటకు వచ్చాక కొన్ని విషయాలు తెలిసి, వాళ్లకు సారీచెప్పా. రతిక ఫ్లిప్స్టార్, కన్నింగ్స్టార్, ల్యాగ్స్టార్ అనే పేర్లను పొగొట్టుకున్నానని అనుకుంటున్నా. వారమంతా జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుని అందులో సరైన కారణాలు వెతికి నామినేట్ చేయాలి. అంతేకానీ, చిన్న చిన్న కారణాలతో నామినేట్ చేయడం నా (Rathika rose) వల్ల కాదు. అందుకే ఒక వారం నామినేషన్స్ నాతో మొదలు పెట్టమంటే కాస్త సమయం అడిగా’’
అతడి మాటలు బాధించాయి!
‘‘బయటకు వచ్చి వెళ్లాక రెండోవారంలో జరిగిన విషయాలను యావర్తో పంచుకుంటే, వాటినే ఉపయోగించి అతడు అమర్ను నామినేట్ చేశాడు. నేనేమీ కావాలని చెప్పలేదు. ఏదో మాటల సందర్భంలో చెప్పాను. ఇక బొమ్మ పట్టుకునే టాస్క్లో అమర్తో అనవసరంగా గొడవ ఎందుకని బతిమిలాడా. ఇక అమర్ కెప్టెన్సీ టాస్క్ ఆడుతున్నప్పుడు అతడికి సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఉంది. ఈ మధ్యలో వ్యక్తిగతంగా నన్ను (Rathika rose) రెండు, మూడు మాటలు అన్నాడు. వాటికి చాలా బాధ అనిపించింది. అందుకే ప్రియాంకను సపోర్ట్ చేశా’’
నా గురించి వాళ్లకు ఎందుకు?
‘‘మొదటిసారి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత నాకూ అభిమానులు ఉన్నారని అర్థమైంది. మళ్లీ రీఎంట్రీ అప్పుడు నన్ను చాలా మంది ప్రోత్సహించారు. ఆ బాధ్యత నాపై పడిపోయింది. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. గతంలో చేసిన తప్పులను సరిచేసుకోవడానికి మళ్లీ హౌస్లోకి వెళ్లా. నెగెటివ్ టాక్ పోవాలని కోరుకున్నా. వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వచ్చిన వాళ్లు బయట ఏం జరిగిందో ‘బిగ్బాస్ బజ్’ చూసి అక్కడి వాళ్లకు చెప్పారు. దీంతో సందర్భం వచ్చినప్పుడు వాళ్లు ఆ విషయాలను తీసుకొచ్చి నేను (Rathika rose) బాధపడేలా కామెంట్స్ చేసేవారు. ఆ మాటలకు పైకి నవ్వుతూనే లోపల బాధపడేదానిని. ఇక వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్లకు నా గురించి ఎందుకు? అందుకే రెండోసారి వెళ్లినప్పుడు మరీ డౌన్ అయిపోయానేమో. మొదటిసారి వెళ్లినప్పుడు నా వాయిస్ కాస్త గట్టిగా వినిపించేదాన్ని. చాలా విషయాలను ప్రశ్నించేదాన్ని. అది జరగలేదు. యావర్తో ట్రాక్ నడపాలని నాకేమీ లేదు. రోజూ కావాలని వెంటపడి మాట్లాడలేం కదా’’
టాప్-5లో ఉండే అర్హత నాకు లేదు!
‘‘నేను అందరితోనూ బాగున్నా. అటు SPY(శివాజీ, ప్రశాంత్, యావర్), ఇటు SPA (శోభ, ప్రియాంక, అమర్) బ్యాచ్తో కలిసి లేను. ప్రశాంత్ విషయంలో ఇప్పటికీ నా తప్పును అంగీకరిస్తా. ప్రతిసారీ వచ్చే వారం బాగా ఆడతానని చెప్పడం సరికాదేమో. నాకు ఓట్లు వేసి సపోర్ట్ చేసి వారికి సారీ అని చిన్న మాటతో చెప్పి మభ్యపెట్టలేను. ఒక విషయమైతే చెప్పగలను. ‘బిగ్బాస్’లో టాప్-5లో ఉండే అర్హత నాకు (Rathika rose) లేదు. అందుకు నన్ను క్షమించండి. టాప్-3లో ఒకరిగా శివాజీ అన్నను చూడాలనుకుంటున్నా’’
ఈ సందర్భంగా పూలకుండీ, చెత్తకుండీలలో ఎవరెవరిని వేస్తావు అనగా, శివాజీ, ప్రశాంత్, అర్జున్ ఫొటోలను పూలకుండీలో ఉంచిన రతిక.. యావర్, గౌతమ్, అమర్, శోభ, ప్రియాంకల ఫొటోలను చెత్తకుండీలో వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం