Murali mohan: ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అడుగు పెట్టిన అన్ని రంగాల్లోనూ విజయం సాధించారు నటుడు మురళీమోహన్ (Murali mohan). కష్టాన్ని నమ్ముకున్న ఆయన్ని కళామతల్లి అక్కున చేర్చుకొని ఒక గొప్ప నటుడిగా తీర్చిదిద్దింది. మంచి మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన.. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయనతో పాటు ఆయన కోడలు మాగంటి రూప కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మీ అసలు పేరేంటి?
మురళీ మోహన్: రాజారామ్మోహన్రాయ్.. మా నాన్నకు స్వాతంత్ర్య సమరయోధులంటే ఇష్టం. అందుకే మా అందరికీ ఇలాంటి పేర్లే పెట్టారు. స్కూల్లో చేరినప్పుడు రాజబాబు అని మార్చుకున్నా. సినిమాల్లోకి వచ్చాక మురళీ మోహన్ అయ్యాను. నాకు ఇండస్ట్రీకి వచ్చేసరికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మేము చేసుకున్న పూజల ఫలితంగా మా పిల్లలకు పెళ్లైయ్యాక కూతురు లాంటి కోడలు వచ్చింది. కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు. మా కోడలు కూడా నన్ను నాన్నగారు అనే పిలుస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయింది. దైవబలం ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కావు.
ఎవరో హీరో మిమ్మల్ని శ్రీరామచంద్రుడితో పోల్చారట.. ఎవరాయన?
మురళీ మోహన్: అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao). ఆయన నాకు ఆరాధ్య దైవం. ఆయన, సావిత్రి ఇద్దరూ నాకు చాలా ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని చూడాలనుకున్నా. అలాంటి నేను ఇండస్ట్రీకి రావడం.. ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తా. ఒకసారి అమెరికాలోని కార్యక్రమంలో ఆయన స్టేజ్పై మాట్లాడుతూ.. నన్ను శ్రీరామచంద్రుడితో పోల్చారు.
మీ నాన్నగారు మిమ్మల్ని రాజా అని పిలుస్తారట.. ఎందుకు?
రూప: నాన్నకు మొదట అబ్బాయ్ పుడితే రాజా అని పిలవాలని నాన్నమ్మ కోరుకుంది. కానీ నేను పుట్టా.. అందుకే నన్నే రాజా అని పిలుస్తారు. అదే ఇప్పటికీ కొనసాగిస్తారు. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నచ్చితే 100 సార్లు చూస్తాను. ‘శంకరాభరణం’ 100సార్లు చూశా. ఆ సినిమా స్ఫూర్తితో డ్యాన్స్ నేర్చుకున్నా.
వ్యవసాయం అంటే ఇష్టమా?
రూప: గౌరవం. మా ఇంట్లో అందరికీ వ్యవసాయమంటే ఇష్టం. నాకు నీతి ఆయోగ్ నుంచి అవార్డ్ కూడా వచ్చింది. ఆ అవార్డు వచ్చాక చంద్రబాబునాయుడు గారికి చూపించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నా. ఎందుకంటే దానికి ముందు జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోయాను. ఓటమితో కుంగిపోకుండా బలంగా పని చేశాను. సేవ చేస్తున్నానని ఆయనతో చెప్పాను.
మురళీ మోహన్: మహిళా సాధికారికత కోసం రూప చాలా పని చేసింది. శ్రీలంకలో 10 ఏళ్లు ఉండి అక్కడి మహిళలకు చదువు విలువ తెలియజేసింది.
మీ భర్త మీకు పెళ్లికి ముందే పరిచయమా?
రూప: అవును. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. అలా పరిచయం. అది ప్రేమగా మారింది. ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నాక పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని మా వారు మొక్కుకున్నారు. అందుకే 20 మందితో గుడిలో చేసుకున్నాం. తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటుచేశాం.
కోట శ్రీనివాసరావు మిమ్మల్ని ఏదో సలహా అడిగారట.. ఏమిటది?
మురళీ మోహన్: ఆయనది బ్యాంక్ ఉద్యోగం. సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఏది ఎంచుకోవాలో అర్థం కావట్లేదని నన్ను సలహా అడిగాడు. సినిమాల్లో నటిస్తూ ప్రతీ రెమ్యునరేషన్లో సగం దాచుకోమని చెప్పా. ఒకవేళ అవకాశాలు రాకపోతే ఆ దాచిన డబ్బు ఉపయోగపడుతుందన్నాను.
మీరు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు?
రూప: నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఆయనతోపాటు నేను కొన్ని పనులు చేశాను. స్ఫూర్తి మాత్రం ఎన్టీఆర్ స్పీచ్. అది నన్ను కదిలించింది. ఒక మనిషి చెప్పింది అంతమంది వింటున్నారంటే గొప్ప విషయం. నాకు జనంతో ఉండడం ఇష్టం. రాజకీయాలంటే జనం అనుకుని వచ్చాను. పాలిటిక్స్ ఇలా ఉంటాయని అప్పట్లో తెలియదు. కుటుంబం ప్రోత్సహించకుండా ఏదీ సాధ్యం కాదు. నా ఫ్యామిలీ నాకు అండగా ఉంది. మా వారికి మాత్రం రాజకీయాలంటే ఇష్టం లేదు. అయినా నా కల కోసం నన్ను సపోర్ట్ చేశారు.
పాలిటిక్స్ నుంచి ఏం నేర్చుకున్నారు?
రూప: పోరాటం చేయగలిగితేనే రాజకీయాల్లోకి వెళ్లాలి. ఈ రంగంలో విమర్శ, ప్రతి విమర్శలు సహజం. కానీ నేటి పరిస్థితుల్లో అది దూషణల దాకా వెళ్తుంది. అభ్యర్థులను మాత్రమే కాకుండా వాళ్ల కుటుంబాలను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఎంత ఎక్కువ దూషిస్తే అంత గొప్ప నాయకుడని.. అదే గొప్ప నాయకుడి లక్షణమనేలా తయారైంది. నాకు ఆ అలవాటు లేదు.
మొదటిసారి అమెరికా ఎప్పుడు వెళ్లారు?
మురళీ మోహన్: మా అమ్మాయి పెళ్లి సంబంధాల కోసం వెళ్లాను. అక్కడి సంబంధమే చేసుకోవడంతో.. అప్పటినుంచి తరచూ వెళ్తూనే ఉన్నాను. మా పిల్లలు అమెరికాలో ఉన్నా మా గురించి ఎక్కడా చెప్పరు. సెలబ్రిటీ పిల్లల్లా కాకుండా సాధారణంగా ఉంటారు. నా భార్య నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంటుంది. చాలా సాధారణ జీవితం గడుపుతుంది. కాటన్ చీర కట్టుకుంటుంది. నగలు కూడా వేసుకోదు. ఒకసారి మా ఇంటికి ఎవరో వచ్చి మా ఆవిడను చూసి పని అమ్మాయనుకున్నారు. ఇంట్లో ఇన్ని నగలు ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదా అని అడిగితే వద్దంటుంది. కానీ, చాలా తెలివైనది.
రూప: మా అత్తగారిని నేను అమ్మ అని పిలుస్తాను. ఆవిడకు అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది. ఏది అడిగినా మంచి సలహా ఇస్తారు.
మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
మురళీ మోహన్: మాకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అందులో కోడెల శివప్రసాద్ కూడా ఉండేవారు. ఆ గ్రూప్స్లోని వారందరూ ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాం. ఏ కష్టమొచ్చినా అందరం కలుస్తాం. అందరికీ అండగా ఉంటాం. చిరంజీవి నేను చాలా ఆప్యాయంగా ఉంటాం. వెంకయ్యనాయుడిని చూసి చాలా నేర్చుకున్నా. పాలిటిక్స్ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నా.
మీ అమ్మాయికి ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిరిందని వార్తలు వచ్చాయి.. నిజమేనా?
రూప: నిజమే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు శ్రీసింహాతో మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్