బాలకృష్ణతో తలపడనున్న సునీల్ శెట్టి?
నందమూరి బాలకృష్ణ సినిమాలంటే మాస్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆయన ఏం చేసినా అభిమానులను దృష్టిలో పెట్టకొనే చేస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: నందమూరి బాలకృష్ణ సినిమాలంటే మాస్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆయన ఏం చేసినా అభిమానులను దృష్టిలో పెట్టకొనే చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్కి చెందిన పలువురి నటుల పేర్లు తెరపైకి వచ్చాయి. ‘కేజీయఫ్2’లో నటిస్తోన్న సంజయ్ దత్ పేరు తొలుత ప్రస్థావనకు వచ్చింది. అయితే తాజాగా ఆ స్థానంలో సునీల్ శెట్టి పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు త్వరలోనే ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.
సునీల్ ఆ మధ్య కన్నడ నటుడు కిచ్చా సుదీప్తో కలిసి ‘పహిల్వాన్’ చిత్రంలో నటించి అలరించారు. ఇక తెలుగులో మంచు విష్ణుతో కలిసి ‘మోసగాళ్లు’ చిత్రం చేస్తున్నారు. ఓ విధంగా చూస్తే తెలుగు తెరకు సునీల్ కొత్తేమీ కాదు అనే భావన కూడా వస్తోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘బీబీ3’గా రూపొందుతున్న చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మాత. ఈ సినిమాను మే 28, 2021న విడుదల చేయనున్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!