Hanuman: హనుమాన్గా చిరంజీవి.. రాముడిగా మహేశ్ చేస్తారేమో: ప్రశాంత్ వర్మ
Jai Hanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ‘జై హనుమాన్’ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హైదరాబాద్: ‘హనుమాన్’(Hanu-Man)తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విజయోత్సాహంతో ప్రశాంత్ వర్మ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘జై హనుమాన్’ పట్టాలెక్కనుంది. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’అన్న ఆసక్తికర అంశంతో ఇది రూపొందనుంది. అయితే, ఇందులో హనుమంతుడు, రాముడి పాత్రలను ఎవరు పోషిస్తారు? అన్న అంశంపై అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హనుమాన్, రాముడి పాత్రలను ఎవరు చేస్తే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘జై హనుమాన్’ (Jai Hanuman) మూవీ స్కేల్ చాలా పెద్దది. స్టార్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాలు వ్యక్తపరచడంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఎందుకంటే బయట మనం చూసే హనుమాన్లా ఆ పాత్ర ఉండదు. ఆంజనేయస్వామికి అష్ట సిద్ధులు తెలుసు. కాబట్టి, ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. ఆ శక్తులను వివరంగానే చూపిస్తాం. హనుమాన్ పాత్ర పోషించడానికి పలువురు బాలీవుడ్ నటులు ఆసక్తి చూపారు. అయితే, ఆన్స్క్రీన్తో పాటు, ఆఫ్ స్క్రీన్లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవిగారు (Chiranjeevi) కూడా ఉండవచ్చు’’
‘‘పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత కలవలేదు. ఆయన ఇంటి వద్ద అంతా కోలాహలంగా, వేడుకగా ఉంది. అదంతా కాస్త సద్దుమణిగాక వెళ్లి కలుస్తా. అన్నీ కుదిరితే చిరంజీవిగారే ఆ పాత్ర చేసే అవకాశం కూడా ఉండొచ్చు. చెప్పలేం. ఇక రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేశ్బాబు (Mahesh babu). సోషల్మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశా. మా ఆఫీస్లో కూడా మేం రాముడి పాత్రను ఆయన ముఖంతో రీక్రియేట్ చేసి చూసుకున్నాం’’
‘‘మేము అనుకున్న ఇండియన్ సూపర్ హీరోల కథలన్నీ సినిమాలుగా తీస్తాం. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఒకవేళ పెద్ద హీరోతో సినిమా చేయాల్సి వచ్చినా స్క్రిప్ట్లో మార్పులు చేయం. కొన్ని పరిమితులకు లోబడి వాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. వారి ఆలోచనలు నచ్చితే, పరిశీలిస్తాం. ఏదైనా అంతిమ నిర్ణయం చిత్ర బృందానిదే. కొన్ని కథలను కేవలం కొత్త నటీనటులతో చేస్తాం. మహిళా ప్రాధాన్యం ఉన్న మూవీలో సమంత (Samantha) చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’
‘‘ఇక నుంచి మా సినిమాలు శరవేగంగా సాగుతాయి. గతంతో పోలిస్తే, మాకు అనేక వనరులు సమకూరాయి. ‘అధీర’ సినిమా కూడా ఉంటుంది. 25 మందితో స్క్రిప్ట్ టీమ్ పనిచేస్తోంది. ఈ సంఖ్యను 100కు పెంచుతా. ఏ స్టోరీపై ఎవరు పనిచేయాలో ముందే చెబుతా. వాళ్లలో కొందరు దర్శకులు కూడా అవుతారు. ముందుగా వాళ్లకు కొంత అమౌంట్ ఇచ్చి, కొన్ని సన్నివేశాలను షూట్ చేసుకుని రమ్మంటాం. మా విజన్కు సరిపోయేలా ఉంటే, మిగిలిన చిత్రానికి వాళ్లే దర్శకత్వం వహిస్తారు. ‘జై హనుమాన్’ పనులు ఏడాది కిందటే మొదలు పెట్టాం. కథ సిద్ధమే. ఎలా తీయాలో అన్నదానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. వీఎఫ్ఎక్స్ సహా చాలా విషయాలు నేర్చుకోవాలి. వాటన్నింటిపైనా అవగాహన రాగానే షూటింగ్ మొదలవుతుంది. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడం’’ అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..