Hanuman: హనుమాన్గా చిరంజీవి.. రాముడిగా మహేశ్ చేస్తారేమో: ప్రశాంత్ వర్మ
Jai Hanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ‘జై హనుమాన్’ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హైదరాబాద్: ‘హనుమాన్’(Hanu-Man)తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). తేజ సజ్జా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విజయోత్సాహంతో ప్రశాంత్ వర్మ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘జై హనుమాన్’ పట్టాలెక్కనుంది. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’అన్న ఆసక్తికర అంశంతో ఇది రూపొందనుంది. అయితే, ఇందులో హనుమంతుడు, రాముడి పాత్రలను ఎవరు పోషిస్తారు? అన్న అంశంపై అటు సినీ వర్గాలు, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హనుమాన్, రాముడి పాత్రలను ఎవరు చేస్తే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘జై హనుమాన్’ (Jai Hanuman) మూవీ స్కేల్ చాలా పెద్దది. స్టార్ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. హనుమంతుడి పాత్ర ఎవరు చేసినా హావభావాలు వ్యక్తపరచడంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఎందుకంటే బయట మనం చూసే హనుమాన్లా ఆ పాత్ర ఉండదు. ఆంజనేయస్వామికి అష్ట సిద్ధులు తెలుసు. కాబట్టి, ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. ఆ శక్తులను వివరంగానే చూపిస్తాం. హనుమాన్ పాత్ర పోషించడానికి పలువురు బాలీవుడ్ నటులు ఆసక్తి చూపారు. అయితే, ఆన్స్క్రీన్తో పాటు, ఆఫ్ స్క్రీన్లోనూ వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలన్న భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవిగారు (Chiranjeevi) కూడా ఉండవచ్చు’’
‘‘పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత కలవలేదు. ఆయన ఇంటి వద్ద అంతా కోలాహలంగా, వేడుకగా ఉంది. అదంతా కాస్త సద్దుమణిగాక వెళ్లి కలుస్తా. అన్నీ కుదిరితే చిరంజీవిగారే ఆ పాత్ర చేసే అవకాశం కూడా ఉండొచ్చు. చెప్పలేం. ఇక రాముడిగా నా మనసులో ఉన్న నటుడు మహేశ్బాబు (Mahesh babu). సోషల్మీడియాలో ఆయన్ను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశా. మా ఆఫీస్లో కూడా మేం రాముడి పాత్రను ఆయన ముఖంతో రీక్రియేట్ చేసి చూసుకున్నాం’’
‘‘మేము అనుకున్న ఇండియన్ సూపర్ హీరోల కథలన్నీ సినిమాలుగా తీస్తాం. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఒకవేళ పెద్ద హీరోతో సినిమా చేయాల్సి వచ్చినా స్క్రిప్ట్లో మార్పులు చేయం. కొన్ని పరిమితులకు లోబడి వాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. వారి ఆలోచనలు నచ్చితే, పరిశీలిస్తాం. ఏదైనా అంతిమ నిర్ణయం చిత్ర బృందానిదే. కొన్ని కథలను కేవలం కొత్త నటీనటులతో చేస్తాం. మహిళా ప్రాధాన్యం ఉన్న మూవీలో సమంత (Samantha) చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’
‘‘ఇక నుంచి మా సినిమాలు శరవేగంగా సాగుతాయి. గతంతో పోలిస్తే, మాకు అనేక వనరులు సమకూరాయి. ‘అధీర’ సినిమా కూడా ఉంటుంది. 25 మందితో స్క్రిప్ట్ టీమ్ పనిచేస్తోంది. ఈ సంఖ్యను 100కు పెంచుతా. ఏ స్టోరీపై ఎవరు పనిచేయాలో ముందే చెబుతా. వాళ్లలో కొందరు దర్శకులు కూడా అవుతారు. ముందుగా వాళ్లకు కొంత అమౌంట్ ఇచ్చి, కొన్ని సన్నివేశాలను షూట్ చేసుకుని రమ్మంటాం. మా విజన్కు సరిపోయేలా ఉంటే, మిగిలిన చిత్రానికి వాళ్లే దర్శకత్వం వహిస్తారు. ‘జై హనుమాన్’ పనులు ఏడాది కిందటే మొదలు పెట్టాం. కథ సిద్ధమే. ఎలా తీయాలో అన్నదానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. వీఎఫ్ఎక్స్ సహా చాలా విషయాలు నేర్చుకోవాలి. వాటన్నింటిపైనా అవగాహన రాగానే షూటింగ్ మొదలవుతుంది. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడం’’ అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ