venky atluri: ఈ కథకీ... ‘సూపర్ 30’, ‘త్రీ ఇడియట్స్’కీ సంబంధమేమీ లేదు!
ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘సార్’ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఈసందర్భంగా ఆయన పంచుకున్న ఆసక్తికర విశేషాలు..
‘‘మూడు ప్రేమకథలు చేశాక... ఈసారి ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనుకొన్నా. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ‘సార్’ కథ. ఒక తరహా కథలకి పరిమితం కాకుండా... అన్ని రకాల చిత్రాల్ని తెరకెక్కించడమే నాకు ఇష్టం’’ అన్నారు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ‘తొలిప్రేమ’తో మెగాఫోన్ చేతపట్టిన ఆయన... ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలతో తన ప్రతిభని చాటి చెప్పారు. ఇటీవల ధనుష్ కథానాయకుడిగా ‘సార్’ తెరకెక్కించారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి పంచుకున్న విశేషాలివి..!
‘‘నా చదువులు 90వ దశకంలోనే సాగాయి. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను ఎదురు చూసిన సంఘటనల్ని ఆధారంగా చేసుకునే ఈ కథ రాసుకున్నా. 90ల నాటి కథే అయినా ఇప్పటి పరిస్థితుల్నీ ప్రతిబింబిస్తుంది. ఈ కథాంశం ఎప్పుడైనా సరే, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. విడుదల తర్వాత అదే రుజువైంది. చదువుకునే పిల్లలకి ఎంతగా నచ్చిందో, వాళ్ల తల్లిదండ్రుల్నీ అంతే కదిలించింది’’
‘‘సినిమా చూశాక దర్శకులు త్రివిక్రమ్, కథానాయకులు నితిన్, వరుణ్తేజ్, నిర్మాత శిరీష్తోపాటు ఇంకా చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా చేశావని మెచ్చుకున్నారు. చెన్నైలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశా. వాళ్లు చివరి వరకు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. తెలుగులో ప్రీమియర్ షో నుంచీ బాగుందంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. కొంతమందైతే హిందీలో కూడా విడుదల చేయాల్సిందన్నారు. ఈ స్పందన చాలా తృప్తినిచ్చింది’’.
‘‘ఈ కథ రాసుకున్నాక నా మనసులో ధనుష్ తప్ప మరొకరు లేరు. ఆయనకే కథ చెప్పే అవకాశం రాగానే చాలా సంతోషించా. కథ వినగానే ఆయన చప్పట్లు కొట్టి డేట్స్ ఎప్పుడు కావాలన్నారు. ఆయన విజన్ ఉన్న నటుడు. సన్నివేశం చేస్తున్నప్పుడు ఇదెలా వస్తుందో అలవోకగా ఊహిస్తారు. ఆయనలో స్పష్టతని గమనించి చాలా నేర్చుకున్నా’’
‘‘త్రివిక్రమ్ ఆలోచనలు ఈ కథపై చాలా ప్రభావం చూపించాయి. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆయనతో సాగించిన చర్చల నుంచి పుట్టినవే. ఆయన అనుభవాల స్ఫూర్తితో రాశా. చాలా మంది పోలుస్తున్నట్టుగా ఈ కథకీ... ‘సూపర్ 30’, ‘త్రీ ఇడియట్స్’కీ సంబంధమేమీ లేదు. ‘సూపర్ 30’ కంటే ముందే రాసుకున్న కథ ఇది. ఆ సినిమా కూడా విద్య నేపథ్యంలోనే అని తెలిసి భయపడుతూ చూశా. అదొక జీవిత కథ అయితే, ఇదొక కల్పిత కథ’’.
‘‘ప్రేమకథలంటే నాకెప్పుడూ ఇష్టమే. వాటిని వదిలేస్తానని చెప్పను కానీ... ఇకపై విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. తదుపరి అందరినీ సీటు అంచున కూర్చోబెట్టే ఓ సినిమా చేయాలనుకుంటున్నా. దాని గురించి ఇప్పుడే చెప్పలేను కానీ, ‘సార్’ని ఎక్కువ మందికి చేరవేయడమే నా ముందున్న లక్ష్యం. దీనికి కొనసాగింపు ఆలోచనంటూ ఏమీ లేదు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం