సెకండాఫ్ బాలేదంటే ఫోన్ పెట్టేశాడు..: విజయ్ తండ్రి విమర్శలు లోకేశ్ కనగరాజ్ని ఉద్దేశించేనా..?
కోలీవుడ్కు చెందిన ఓ దర్శకుడిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు విజయ్ తండ్రి చంద్రశేఖర్.
చెన్నై: కోలీవుడ్కు చెందిన ఓ చిత్ర దర్శకుడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్ (Vijay) తండ్రి ఎస్.చంద్రశేఖర్. సినిమా బాలేదని చెబితే అతడు ఫోన్ కట్ చేశాడన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ‘‘విజయ్ దగ్గరకు వచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా ఒక అభిమానిగా వింటా. వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి నివృత్తి చేసుకుంటా. కానీ, నేటి రోజుల్లో స్క్రీన్ప్లేకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తమ సినిమాలో ఒక స్టార్ హీరో ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదనుకుంటున్నారు. హీరో వల్లే సినిమా హిట్ అయినా.. తాను ఏదో గొప్ప అన్నట్లు దర్శకుడు భావిస్తున్నాడు. కథ బాగుంటే అది భారీ విజయం అందుకుంటుందనేది నా అభిప్రాయం.
Hanuman: ‘హనుమాన్’.. అలాంటివారికి ఇదొక చెంపదెబ్బ : చిలుకూరు ప్రధాన అర్చకులు
మరో ఐదు రోజుల్లో రిలీజ్ అనగా.. ఓ సినిమా చూశా. వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి.. ప్రథమార్ధం చాలా బాగుంది. సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలు.. ముఖ్యంగా తండ్రి తన సొంత కొడుకునే చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పా. నా మాటలకు అతడు.. ‘సర్, భోజనం చేస్తున్నా. మళ్లీ కాల్ చేస్తా’ అని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత కాల్ చేయలేదు. సినిమా విడుదలయ్యాక చాలామంది నాలానే అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడు నా మాట విని మార్పులు చేసి ఉంటే మరొక విధంగా ఉండేది. నా విమర్శలను స్వీకరించేంత ధైర్యం, పరిణతి అతడికి లేవు’’ అని అన్నారు.
చంద్రశేఖర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆయన మాట్లాడుతున్నది ‘లియో’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ను ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్టులు పెడుతున్నారు. విజయ్ (Vijay), లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘లియో’ (LEO). లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఇది మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. విజయ్ నటన బాగున్నప్పటికీ కథలో లోపాలున్నాయని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు. -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్లు పెట్టారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అందుకే సెల్ఫీ అడిగితే పారిపోతా: ఫహద్ ఫాజిల్
ఎవరైనా సెల్ఫీ అడిగితే తాను పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ పేర్కొన్నారు. -
‘హీరామండి’ షూటింగ్లో డిప్రెషన్లోకి వెళ్లా: మనీషా కొయిరాల
‘హిరామండి’ షూటింగ్ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లినట్లు మనీషా కొయిరాల తెలిపారు. -
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
విజయ్ దేవరకొండ-రష్మిక జోడి మరోసారి స్క్రీన్పై మెరవనున్నట్లు తెలుస్తోంది. -
27 ఏళ్లలో బాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం రాలేదు: జ్యోతిక
తన తొలి చిత్రం ప్రేక్షకాదరణ పొందని కారణంగా 27 ఏళ్లు బాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదని జ్యోతిక అన్నారు. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు
-
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!