Chiranjeevi: మా ఇద్దరిలో కామన్‌ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న

చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది.

Updated : 10 May 2024 12:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నటుడు చిరంజీవి పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన కుటుంబసభ్యులు హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందు చిరు, ఉపాసనల మధ్య జరిగిన సరదా సంభాషణల వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

‘మావయ్య.. క్లీంకారకు, నాకు మధ్య ఉన్న కామన్‌ పాయింట్ ఏంటో చెప్పండి?’ అని చిరంజీవిని ఉపాసన అడగ్గా.. ‘క్లీంకార నీకు ప్రతిరూపం’ అని సమాధానమిచ్చారు. దానికి ఉపాసన.. ‘కాదు, మేమిద్దరం పద్మవిభూషణ్‌ల మనవరాళ్లం’ అని నవ్వుతూ చెప్పారు. దానికి చిరు నిజమే కదూ అని అన్నారు. ఉపాసన తాత ప్రతాప్‌ సి. రెడ్డికి 2010లో పద్మ విభూషణ్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ

ఇక పురస్కారం అందుకున్న తర్వాత చిరంజీవి తన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘కళామతల్లికి, కళారంగంలో నన్ను వెన్నుతట్టి నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను ప్రేమించి అభిమానించిన అందరికీ, పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. అలాగే చిరంజీవిని ఉద్దేశిస్తూ రామ్‌ చరణ్‌ (Ram charan) పోస్ట్‌ పెట్టారు. ఆయనతో దిగిన ఫొటోను షేర్‌ చేసి ‘శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అని రాశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు