
ఆ ప్రొఫెసర్కు రూ.13 కోట్ల ఫెలోషిప్
వాషింగ్టన్: భారత సంతతి అమెరికా ప్రొఫెసర్ ముబారక్ ఉస్సేన్ సయ్యద్ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో ప్రతిష్ఠాత్మక కెరీర్ ఫెలోషిప్ అవార్డ్ను సాధించారు. మెదడుపై చేస్తున్న ప్రయోగానికి గాను యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ దీనిని ప్రదానం చేసింది. ఇందుకుగాను ఐదేళ్ల కాలంలో రూ.13 కోట్ల ఫెలోషిప్ ఆయనకు అందనుంది. కశ్మీర్కు చెందిన ముబారక్ ఉస్సేన్ సయ్యద్, అమెరికా న్యూ మెక్సికో యూనివర్సిటీ న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కశ్మీర్లోని బుద్గాం జిల్లాకు చెందిన సయ్యద్ స్థానికంగానే విద్యనభ్యసించారు. జర్మనీలో తన పీహెచ్డీని పూర్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.