T20 WC 2024: విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ కోసం (T20 World Cup 2024) భారత జట్టును ప్రకటించడానికి బీసీసీఐ సెలక్టర్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని 15 మందితో కూడిన టీమ్లో ఎవరికి చోటు దక్కనుందో ఆసక్తికరంగా మారింది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తమ డ్రీమ్ స్క్వాడ్లను ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కూడా జట్టును ప్రకటించాడు. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. అనూహ్యంగా లఖ్నవూ ఆల్రౌండర్కు స్థానం కల్పించాడు.
‘‘రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. ఆ తర్వాత సంజూశాంసన్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు వస్తారు. నా స్క్వాడ్లో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం ఇస్తా. సంజూతోపాటు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ ఉంటారు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాకు తోడుగా కృనాల్ పాండ్యను తీసుకుంటా. పేస్ ఆల్రౌండర్లు శివమ్ దూబె, హార్దిక్ పాండ్యకు ప్లేస్ లేదు. కుల్చా జోడీని స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఎంచుకుంటా. బుమ్రా, సిరాజ్తోపాటు హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, అవేశ్ఖాన్ పేసర్లుగా ఉంటారు. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు’’ అని వెల్లడించాడు.
కెప్టెన్గా రోహిత్ సరైన ఎంపిక కాదు: భట్టాచార్య
రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా పొట్టి కప్లో ఆడుతుందని చాన్నాళ్ల కిందటే బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే టీమ్ను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ నిర్ణయాన్ని కోల్కతా ఫ్రాంచైజీ మాజీ డైరెక్టర్ భట్టాచార్య ప్రశ్నించారు.
‘‘రోహిత్కు టీ20 వరల్డ్ కప్లో జట్టును నడిపించే బాధ్యతలను అప్పగించడం సరైంది కాదు. టీమ్పై తీవ్ర ప్రభావం పడుతుంది. పొట్టి ఫార్మాట్కు రోహిత్ సరైన సారథి కాదు. హిట్మ్యాన్పై నాకేమీ కోపం లేదు. అతడంటే ఎంతో గౌరవం. అద్భుతమైన క్రికెటర్. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ, టీ20ల్లో అతడు పెద్దగా ఫామ్లో లేడు. అతడితో పోలిస్తే విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, గిల్ మంచి ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు రోహిత్ సారథి కాబట్టి అతడే ఓపెనింగ్ చేస్తాడు. ఫామ్లో ఉన్న మిగతావారు వేరే స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఈ టోర్నీకి రోహిత్ కంటే బుమ్రాను కెప్టెన్గా చేయడం ఉత్తమ ఎంపిక అవుతుంది’’ అని భట్టాచార్య వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.