Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
భాజపా (BJP) ఎంపీ రమేశ్ బిధూడీ (Ramesh Bidhuri) బీఎస్పీ (Bsp) ఎంపీ దానిశ్ అలీపై (Danish Ali) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అలీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భాజపా ఎంపీ, నటుడు రవికిషన్ (Ravi Kishan) లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
దిల్లీ: లోక్సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా భాజపా (BJP) ఎంపీ రమేశ్ బిధూడీ (Ramesh Bidhuri) బీఎస్పీ (Bsp) ఎంపీ దానిశ్ అలీపై (Danish Ali) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. రమేశ్ బిధూడీ వ్యాఖ్యలను పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఖండించారు. తాజాగా దానిశ్ అలీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ భాజపా ఎంపీ, నటుడు రవికిషన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అనుచితంగా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో విజ్ఞప్తి చేశారు. ‘2022లో డిసెంబరు 9న నేను జనాభా నియంత్రణపై ప్రైవేటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాను. ఆ సందర్భంలో కున్వర్ దానిశ్ అలీ అన్పార్లమెంటరీ పదాలు వాడారు. ఆ విషయాన్ని పరిశీలించి సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని’ రవికిషన్ తన లేఖలో పేర్కొన్నారు.
నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
తన సహచర ఎంపీ రమేశ్ బిధూడీ మాట్లాడే సమయంలో దానిశ్ అదే పనిగా అంతరాయం కల్గించారని, వాడీవేడీ వాదనలు జరుగుతున్న సమయంలో బిధూడీ సంయమనం కోల్పోయినందునే ఆయన నోటి నుంచి కొన్ని అభ్యంతరకర పదాలు వెలువడ్డాయని రవికిషన్ లేఖలో వెల్లడించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఎంపీ మరో ఎంపీపై అలాంటి పదాలను వినియోగించడానికి దారి తీసిన పరిస్థితులను స్పీకర్ పరిశీలించాలని కోరారు.
ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేసినందుకే బిధూడీ వివాదాస్పద పదాలను వినియోగించారని భాజపా ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ట్విటర్లో పేర్కొన్నారు. ప్రధానిని తీవ్రంగా దూషించడంతోనే బిధూడీ అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. లోక్సభలో చంద్రయాన్-3పై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ దానిశ్ అలీపై భాజపా ఎంపీ రమేశ్ బిధూడీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. సొంత పార్టీ ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం విచారం వ్యక్తం చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలంటూ బిధూడీకి భాజపా అధిష్ఠానం సైతం షోకాజ్ నోటీసులు పంపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Yuvagalam: మంత్రులూ.. మీకు కౌంట్డౌన్ మొదలైంది: నారా లోకేశ్
వ్యవస్థలను మేనేజ్ చేసి తెదేపా అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
Yuvagalam: పొదలాడ నుంచి నారా లోకేశ్ ‘యువగళం’ పునః ప్రారంభం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. -
మథురలో కృష్ణుడి ఆలయంపై మీ వైఖరేంటో చెప్పండి
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించడం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి ఇష్టంలేదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపించారు. -
11 ఏళ్లలో మాపై 250 కేసులు నమోదు చేశారు
దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న పార్టీ ఆమ్ఆద్మీ(ఆప్) అని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
వైకాపా నాయకుల స్వలాభంతో పేదలకు అన్యాయం
కాసులకు కక్కుర్తి పడిన వైకాపా నాయకులు చౌడు నేలలు, క్వారీల బాంబ్ బ్లాస్టింగ్లు జరిగే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండిపడ్డారు. -
Yuvagalam: నేటి నుంచి కోనసీమలో ‘యువగళం’
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం నుంచి ‘యువగళం’ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. -
మరి ఆ సంస్థ ఎలా తవ్వుతుంది?
ఆంధ్రప్రదేశ్లో ఇసుక టెండరు కాల పరిమితి ముగిసిందని జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలకు(ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) ఇచ్చిన నివేదికల్లో జేపీ పవర్ వెంచర్స్ సంస్థ స్పష్టం చేసిందని.. అయినా గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి మాత్రం పాత సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
ఓట్ల తొలగింపు కుట్రదారు.. మద్దాళి
‘గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కుట్రదారు ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ అని బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది. -
నిలదీస్తే నిర్బంధం... ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడం
రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులకు దిక్కులేదని.. నిలదీస్తే నిర్బంధం, ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే అవినీతి, అరాచక పాలన సాగుతోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. -
దళిత బహుజనుల హత్యలకు జగన్దే బాధ్యత
వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హత్యలు, వారిపై దారుణాలకు సీఎం జగన్దే బాధ్యతని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
ప్రజల విశ్వాసం కోల్పోయిన మోదీ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన మాటను తప్పి ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. -
తెదేపా నేతల గృహ నిర్బంధం
పల్నాడు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు సిద్ధమైన తెదేపా-జనసేన నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: అలా చేస్తేనే.. ధోనీ వచ్చే సీజన్ మొత్తం ఆడగలడు: అనిల్ కుంబ్లే
-
సాయుధ తిరుగుబాటు అంచున సియర్రా లియోన్.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..!
-
Cricket News: వరల్డ్ కప్లో భారత్ తడబాటే కనిపించలేదన్న లారా.. సూర్య కెప్టెన్సీపై ప్రసిధ్ కామెంట్స్!
-
Shashi Tharoor: బిల్గేట్స్.. నారాయణమూర్తి రాజీకొస్తే: ‘పని గంటల’పై శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
-
Audi India: జనవరి నుంచి ఆడీ కార్ల ధరల పెంపు.. ఎంతంటే?
-
Oneplus 12: రిలీజ్కు ముందే వన్ప్లస్ 12 లుక్ లీక్ (pics)