Lok Sabha Polls: ఆ రెండు పార్టీలూ ఏకమైనా.. 20 సీట్లలో మేమే గెలుస్తాం: సిద్ధరామయ్య
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 15 నుంచి 20 సీట్లు గెలుచుకుంటుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.
హుబ్బళ్లి: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా(BJP), జేడీఎస్(JDS)లు ఏకమవుతాయా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) స్పందించారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేసినా, చేయకపోయినా 15 నుంచి 20 సీట్లలో గెలుపు కాంగ్రెస్దేనని విశ్వాసం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన హుబ్బళ్లిలో మాట్లాడారు. ‘‘ఆ రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఐక్యంగా పోటీ చేస్తారో లేదో నాకు తెలియదు. వాళ్లు కలిసినా మాకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఒకవేళ వారు కలిసినా, కలవకపోయినా సరే మేం మాత్రం 15 నుంచి 20 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటాం’’ అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి పని చేస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి జులై 21న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2024 లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections 2024)కు ముందే భాజపా, జేడీఎస్ చర్చలు జరగడంతో.. పొత్తు ఖాయమేనంటూ గత కొంత కాలంగా వచ్చిన వార్తలకు ఆయన ప్రకటన బలం చేకూర్చినట్టయింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తాజాగా కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు వచ్చినా సరే ఒంటరిగానే బరిలో దిగుతామని తేల్చి చెప్పడం గమనార్హం. 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 28 సీట్లకు గాను భాజపా 25 సీట్లు గెలుచుకొని క్లీన్స్వీప్ చేయగా.. కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసీటుకు పరిమితమయ్యారు. అయితే, ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకొని భారీ విజయం సాధించగా.. భాజపా 66, జేడీఎస్ 19 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు