Kishanreddy: కేసీఆర్‌ సర్కారు వల్లే గిరిజన మ్యూజియం ఆలస్యం: కిషన్‌రెడ్డి

నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రాంజీ గోండు పోరాడారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొనియాడారు.

Updated : 16 Feb 2024 16:22 IST

హైదరాబాద్: నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రాంజీ గోండు పోరాడారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొనియాడారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లో రాంజీ గోండు పేరుతో గిరిజన మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. దేశ వ్యాప్తంగా 10 ట్రైబల్ మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు.

‘‘ఆనాటి కేసీఆర్‌ ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైంది. ఆయనకు ఎన్ని లేఖలు రాసినా స్పందించ లేదు. ఇవాళ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసింది. గిరిజన వర్సిటీకి మొదటి విడతలో రూ.900 కోట్లు కేటాయించాం. రూ.420 కోట్లతో 17 ఏకలవ్య పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించాం. మేడారం జాతరకు రూ.3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. గిరిజనుల భూములకు హక్కులు కూడా కల్పిస్తున్నాం. వారి సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని