Dadisetti Raja: ఎన్టీఆర్‌పై మంత్రి దాడిశెట్టి అనుచిత వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌పై రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా తొండంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం....

Updated : 27 Sep 2022 07:12 IST

తొండంగి, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌పై రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా తొండంగిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘దేశం మొత్తమ్మీద ఎన్టీఆర్‌ అంత చేతకానివాడు ఎవరూ ఉండరు. ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఆయన గుప్పిట్లో ఉండగా... మంత్రివర్గ సభ్యుడైన నాదెండ్ల భాస్కరరావుతో ఒకసారి, సొంత అల్లుడు చంద్రబాబుతో మరోసారి వెన్నుపోటు పొడిపించుకున్నారు. అందుకే ఎన్టీఆర్‌ను చేతకానివాడిగా వర్ణించాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎన్టీఆర్‌కు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పోలికే లేదు. వైఎస్‌ ప్రజల మనిషి. అమరావతి రైతుల రూపంలో అమరావతి స్థిరాస్తి వ్యాపార మేళం ప్రతి నియోజకవర్గంలో తిరుగుతోంది. వీరంతా వ్యంగ్యంగా నాట్యం చేస్తూ, తొడలు కొడుతున్నారు. వీరి చేష్టలను రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు’ అని మంత్రి రాజా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని