షర్మిలే భాజపా ఏజెంట్: జగ్గారెడ్డి
మంత్రి కేటీఆర్కు కోవర్టు అంటూ తనపై వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. ఆమెయే భాజపా ఏజెంటని ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియాహాలులో ఆయన
గాంధీభవన్, న్యూస్టుడే: మంత్రి కేటీఆర్కు కోవర్టు అంటూ తనపై వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖండించారు. ఆమెయే భాజపా ఏజెంటని ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియాహాలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నాకు కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు. నా దమ్ము చూసి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్లోకి పిలిచారు. ఆయనకు నచ్చిన నేను షర్మిలకు నచ్చలేదంటే ఆమెకు రాజకీయ పరిజ్ఞానం లేదని అర్థం. ఆమె నోరు అదుపులో పెట్టుకోకపోతే అన్ని విషయాలు బయటపెడతా’’ అని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ను మూడు రాజధానులు కాకుంటే మూడు రాష్ట్రాలు చేసుకుని.. జగన్, షర్మిల, విజయసాయిరెడ్డిలు ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలని ఎద్దేవా చేశారు. జగన్కు చెప్పి షర్మిలను సీఎం చేయాలని వై.ఎస్.విజయమ్మకు సలహా ఇస్తున్నానని చెప్పారు. ‘‘మీ కుటుంబం అంతా మోదీ దగ్గర కూర్చుని మూడు రాష్ట్రాలు చేసుకోండి. కానీ, మీ ఇంటి పంచాయితీ ఇక్కడి(తెలంగాణ) జనానికి చుట్టకండి’’ అని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM