Nitish Kumar: బిహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం
బిహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన అభ్యర్థనకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.
ఇంటర్నెట్డెస్క్: బిహార్లో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ (Nitish Kumar) రాష్ట్ర గవర్నర్ రాజేంద్రను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. దీంతో గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానించారు.నీతీశ్ వెంట భాజపా శాసనసభా పక్ష నేత సామ్రాట్ చౌధరీ, ఇతర నేతలు ఉన్నారు.
నేటి సాయంత్రం 5 గంటలకు కొత్త కూటమి ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సాయంత్రం 4.15కు పట్నాకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రిగా నీతీశ్తోపాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ జాబితాలో భాజపా నుంచి సామ్రాట్ చౌధరీ, విజయ్ సిన్హా, డాక్టర్ ప్రేమ్ కుమార్, జేడీయూ నుంచి శ్రవణ్ కుమార్, హెచ్ఏఎం తరఫున సంతోష్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ఉండే అవకాశం ఉంది.
ముగిసిన జేడీయూ-ఆర్జేడీ బంధం.. బిహార్ సీఎం నీతీశ్ కుమార్ రాజీనామా..
మరోవైపు కాంగ్రెస్ తీరును జేడీయూ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ ‘‘ డిసెంబర్ 19న అశోకా హోటల్లో జరిగిన సమావేశంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ఇండియా కూటమిని హైజాక్ చేయడానికి ప్రయత్నించారు. దీనిలో భాగంగానే నాయకత్వ బాధ్యతలను ఖర్గేకు కట్టబెట్టారు. వాస్తవానికి అంతకు ముందు ముంబయిలో జరిగిన సమావేశంలో కూటమి నాయకత్వం ఎవరికీ ఇవ్వకుండానే సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. కానీ, అశోకా హోటల్లో టీఎంసీ నేత మమతా బెనర్జీతో కలిసి ఖర్గే పేరును తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలని ప్రయత్నించారు’’ అని ఆరోపించారు. ఇక నీతీశ్ రాజీనామాపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య స్పందించారు. చెత్త తిరిగి చెత్తకుండీలోకి చేరిందని విమర్శిస్తూ ఎక్స్లో పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?