Nitish Kumar ముగిసిన జేడీయూ-ఆర్జేడీ బంధం.. బిహార్ సీఎం నీతీశ్ కుమార్ రాజీనామా..
బిహార్లో మహా కూటమి ప్రభుత్వం పతనమైంది. సీఎం పదవికి నీతీశ్ కుమార్ రాజీనామా సమర్పించారు.
ఇంటర్నెట్డెస్క్: బిహార్ ముఖ్యమంత్రి పదవికి జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్కు చేరుకుని గవర్నర్కు లేఖ సమర్పించారు. దీంతో ఆర్జేడీతో కలిసి జేడీయూ ఏర్పాటు చేసిన మహాకూటమి ప్రభుత్వం పతనమైంది. తాజాగా నీతీశ్ భాజపాతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
అంతకు ముందు పట్నాలో జరిగిన జేడీయూ ఎమ్మెల్యేల సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని నీతీశ్ వెల్లడించారు. పార్టీ నేతలు కూడా ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాజ్భవన్ వద్ద నీతీశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను. మహా కూటమి ప్రభుత్వం ముగిసింది. అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు.. కొత్త బంధం కోసం ప్రస్తుత కూటమిని వీడాను. దానిలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. మా పూర్వ భాగస్వామి (భాజపా) కలిస్తే ముందుకు సాగుతాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను. గతంలో మాకు పొత్తు కుదిరింది (ఇండియా కూటమిని ఉద్దేశించి). కానీ, ఎవరూ ఏమీ చేయలేదు. నేను ఇండియా కూటమి నుంచి కూడా బయటకు వచ్చేశాను’’ అని ప్రకటించారు. మరోవైపు గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని కోరారు. రాజ్భవన్కు బయల్దేరే ముందు నీతీశ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది.
నీతీశ్ నిర్ణయంపై ఆర్జేడీ ప్రతినిధి శక్తి యాదవ్ స్పందిస్తూ ‘‘నిర్ణయం తీసుకుంటే వారికి అభినందనలు. బిహార్ ప్రజలు అంతా గమనిస్తున్నారు. గతంలో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది నీతీశ్ ఆలోచనే. తాజాగా దీన్ని పడగొట్టాలనేది కూడా ఆయన నిర్ణయమే. మేం తేజస్వీ యాదవ్ హామీని అమలు చేశాం’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్