Kejriwal: ఏళ్ల తర్వాత పంజాబ్కు నిజాయతీగల సీఎం: కేజ్రీవాల్
పంజాబ్కు చాలా ఏళ్ల తర్వాత నిజాయతీ గల వ్యక్తి సీఎం అవుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
అమృత్సర్: పంజాబ్కు చాలా ఏళ్ల తర్వాత నిజాయతీ గల వ్యక్తి సీఎం అవుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రజలకు నిజాయతీతో కూడిన పాలనను అందిస్తామని పంజాబ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో పంజాబ్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అమృత్సర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. కాబోయే సీఎం భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు.
పంజాబ్కు నిజాయతీగల వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వ ఖజానాలోని ప్రతి రూపాయీ ప్రజల కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సొంత పార్టీ నేత అయినా, ఎమ్మెల్యే అయినా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రానికి భగవంత్ మాన్ ఒక్కడే కాదని.. ప్రతి ఒక్కరూ ఓ ముఖ్యమంత్రేనని చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఈ నెల 16న సీఎం ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భగవంత్మాన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మంత్రుల ప్రమాణ స్వీకారం మరో రోజు ఉంటుందని తెలుస్తోంది. భగత్సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖాట్కర్ కలాన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 117 స్థానాలకు గానూ ఆప్ 92 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు