30న తెనాలికి చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.

Published : 27 Apr 2024 05:34 IST

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 30న సాయంత్రం 5గంటలకు హెలికాఫ్టర్‌ ద్వారా పట్టణంలోని సుల్తానాబాద్‌ చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి రోడ్‌షో ద్వారా మార్కెట్ కూడలికి చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. తాను, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, చంద్రబాబు పర్యటనల పర్యవేక్షక బృందం పరిశీలించి చర్చించుకున్న అనంతరం ఏర్పాట్లను సమీక్షిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెదేపా, జనసేన, భాజపా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని.. తెనాలి అభివృద్ధికి ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామని మనోహర్‌ పేర్కొన్నారు. సమావేశంలో మూడు పార్టీల నాయకులు తాడిబోయిన హరిప్రసాద్‌, ఖుద్దూస్‌, పాటిబండ్ల రామకృష్ణ, ఇస్మాయిల్‌బేగ్‌, జాకీర్‌హుస్సేన్‌, రవికాంత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు