Puvvada: 2014లో మంత్రి పదవి ఇవ్వకపోతే తుమ్మల ఇప్పటికే రిటైర్‌ అయ్యేవారు: మంత్రి పువ్వాడ అజయ్‌

కేసీఆర్‌ గురించి తుమ్మల ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరమని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు.

Published : 28 Oct 2023 12:01 IST

ఖమ్మం: కేసీఆర్‌ గురించి తుమ్మల ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరమని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. 2014లో మంత్రి పదవి ఇవ్వకపోతే తుమ్మల ఇప్పటికే రిటైర్‌ అయ్యేవారని విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్‌కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారనేది హాస్యాస్పదమన్నారు.

Thummala Nageswara Rao: కేసీఆర్‌కే నేను మంత్రి పదవి ఇప్పించా

‘‘పదవుల కోసం తుమ్మల దిగజారారు. కేసీఆర్‌, తుమ్మల ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. తుమ్మలపై ఆధారపడి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారా? కేసీఆర్‌ వల్లే మీకు మంత్రి పదవి వచ్చింది. మీ ఓటమికి ఉపేందర్‌ రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. టికెట్‌ ఇచ్చి ఓటమి కోసం డబ్బులిస్తారా? మీకు టికెట్‌ ఇచ్చి ఉండకపోతే సరిపోయేది కదా? తుమ్మల ఎప్పుడూ జైతెలంగాణ నినాదం చేయలేదు. ఆ నినాదం చేసినవారిని జైలు పాలు చేశారు’’ అని పువ్వాడ అజయ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని