Thummala Nageswara Rao: కేసీఆర్‌కే నేను మంత్రి పదవి ఇప్పించా

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. 1995లో కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించిన విషయం మరిచారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

Updated : 28 Oct 2023 10:00 IST

మాజీ మంత్రి తుమ్మల వ్యాఖ్య

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. 1995లో కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించిన విషయం మరిచారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. పాలేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఖమ్మంలోని 9, 41వ డివిజన్లలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో తుమ్మల మాట్లాడారు. ‘‘గోదావరి జలాలను మున్నేరు ద్వారా పాలేరుకు లిఫ్ట్‌ చేసి జిల్లాలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే నా కోరిక. అందుకే కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. 2018 ఎన్నికల్లో పాలేరులో నా ఓటమికి కారణం ఎవరో మీ అంతరాత్మకు తెలుసు. పువ్వాడ అజయ్‌ని మంత్రిని చేయడం కోసం మీ కుమారుడు.. నా ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి నన్ను ఓడించారు. నాడు పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయాడానికి ఎవరూ ముందుకు రాకపోతే పార్టీ శ్రేయస్సు కోరి నేను అంగీకరించాననే సంగతి మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని