Somireddy: విజయసాయిరెడ్డి కనుసన్నల్లో మైన్స్ కుంభకోణం: మాజీ మంత్రి సోమిరెడ్డి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దానికి సంబంధించిన ఆధారాలను తెదేపా (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy)బయటపెట్టారు.
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దానికి సంబంధించిన ఆధారాలను తెదేపా (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి (Somireddy)బయటపెట్టారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓబుళాపురం మైనింగ్, మధు కోడా బొగ్గు మైనింగ్ అతిపెద్ద స్కామ్లని చెప్పారు. ఇప్పుడు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న సిలికా, క్వాడ్జ్ స్కామ్లు ఏపీలో జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు.
‘‘నెల్లూరు జిల్లా పోరాటాలకు పుట్టినిల్లు. ఇప్పుడు భారీ స్కామ్లకు పుట్టినిల్లుగా జగన్ మార్చేశారు. జిల్లాలో మైన్స్ కుంభకోణంపై ఎన్నో పోరాటాలు చేశాం.. డీజీపీకి ఫిర్యాదు చేశాం. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెదేపా హయాంలో ఒక్క టన్నుకి రూ.100 ఉన్న పన్ను.. ఇప్పుడు వైకాపా హయాంలో రూ.381కి పెంచేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మైన్స్ కుంభకోణం జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీకి జగన్కు ఆ కమీషన్ను చేరుస్తున్నారు. మొత్తం రూ.4,455 కోట్ల విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైంది. త్వరలో కేంద్ర విజిలెన్స్ అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి ఊరు పక్కన దోపిడీ జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు’’అని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?