ఫిర్యాదుకు వెళ్తే.. తిరిగి మాపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసా?: తెదేపా
కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో జరిగిన ఘర్షణల్లో తెదేపా నేతలపై అక్రమంగా హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం: కృష్ణా జిల్లా రంగన్నగూడెంలో జరిగిన ఘర్షణల్లో తెదేపా నేతలపై అక్రమంగా హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లిన తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వింత పోకడ సైకో పాలనలో చూస్తున్నామని ధ్వజమెత్తారు.
ఇప్పటి వరకు 50 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు.. ఇతరుల పేరిట 100 మందిపై పెట్టారని ఆరోపించారు. అమెరికాలో ఉన్న నాయకులపైనా తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. గన్నవరం తెదేపా ఇన్ఛార్జ్గా యార్లగడ్డ వెంకట్రావును నియమించిన 24 గంటల్లోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 కేసులు పెట్టించారంటే ఆయన ఎంత పిరికివాడో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రపై వైకాపాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ పన్నుతున్న కుట్రలపై కృష్ణా జిల్లా ఎస్పీకి ముందుగానే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నేతలు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం