Amaravati News: ‘అమరావతి’ విజయంపై తెదేపా నేతలు షరీఫ్, యనమల, దూళిపాళ్ల ఏమన్నారంటే...
ఏపీ ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవట్లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ
అమరావతి: ఏపీ ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవట్లేదని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై పిటిషన్ల హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామన్నా ఆయన.. ఇది అమరావతి రైతుల విజయంగా అభివర్ణించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ఆనాడు నిబంధనల ప్రకారం మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపామని చెప్పారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పు పట్టిందని షరీఫ్ గుర్తు చేశారు.
హైకోర్టు తీర్పును అమలు చేయాలి.. అప్పీల్కు వెళ్లొద్దు: యనమల
ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే మూడు సంవత్సరాలు వృథా చేశారన్నారు. హైకోర్టు తీర్పు అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన యనమల మీడియాతో మాట్లాడారు. అమరావతిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని.. అప్పీల్కు వెళ్లొద్దని సూచించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి జగన్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కొత్త బిల్లు తీసుకొస్తామనడం విచిత్రంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏం చేయాలన్నా రాష్ట్రపతి, కేంద్రం అనుమతి కావాలని యనమల వివరించారు.
ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అభివృద్ధి చేయాలి: ధూళిపాళ్ల
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని వివాదాలకు సీఎం జగన్ స్వస్తి పలకాలని.. స్థానిక రైతులుపై కక్షపూరిత చర్యలు ఆపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!