ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది.
తాజాగా ఎన్నిక నిర్వహించాలి
పిటిషనర్కు రూ.50 వేలు చెల్లించాలి
తీర్పు వెలువరించిన హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్: భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. ఎన్నికను తాజాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ పతిరెడ్డి రాజేశ్వరెడ్డికి రూ.50 వేలు చెల్లించాలని విఠల్ను ఆదేశించింది. అప్పీలుకు వెళ్తామని ఆయన న్యాయవాది అభ్యర్థించడంతో తీర్పు అమలును 4 వారాలపాటు నిలిపివేసింది. 2021 నవంబరు 9న ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. 23న రాజేశ్వర్రెడ్డి నామినేషన్ వేశారు. 26న ప్రకటించిన తుది జాబితాలో ఆయన పేరు లేదు. దస్తూరాబాద్ ఎంపీపీ కిషన్ సింగారి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ను ఉపసంహరించారు. భారాస నేతల బలవంతంతో ఆయన ఈ పని చేశారని, దానికి రిటర్నింగ్ అధికారి సహకరించారని, ఎన్నికను రద్దు చేయాలని రాజేశ్వర్రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విఠల్తో కుమ్మక్కైన కిషన్.. ఫోర్జరీ సంతకం చేసి రాజేశ్వర్రెడ్డి నామినేషన్ను ఉపసంహరించినట్లు తేలిందని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘‘నామినేషన్ సందర్భంగా ఆయన చేసిన సంతకం, ఉపసంహరణ పత్రంలో సంతకం ఒకటి కాదని సెంట్రల్ ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వడంతో అది ఫోర్జరీ అని తేలింది. రాజేశ్వర్రెడ్డి తరఫున నామినేషన్ ఉపసంహరణ నిమిత్తం కిషన్ ఇచ్చిన ఫారంను రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించుకోకుండా ఆమోదించారు. దానివల్ల ఆయనకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది. ఉపసంహరణను ఆమోదిస్తూ ఎన్నికల అధికారి తీసుకున్న చర్య చట్టవిరుద్ధం’’ అని న్యాయమూర్తి తన 71 పేజీల తీర్పులో పేర్కొన్నారు.
ఇది పారదర్శక ఎన్నిక కాదు
‘‘ఇది పారదర్శకమైన ఎన్నిక కాదు. విఠల్, కిషన్ కుమ్మక్కయ్యారు. అయితే రిటర్నింగ్ అధికారి వారితో కుమ్మక్కయ్యారనడానికి పిటిషనర్ ఆధారాలు సమర్పించలేదు. నిబంధనలు పాటించనందున ఆ ఎన్నిక చెల్లదు. పిటిషనర్ రాజేశ్వర్రెడ్డి పోటీలో లేకపోవడం వల్ల ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించాలని ఆదేశించలేం. అందువల్ల ఎన్నికను తాజాగా నిర్వహించాలి’’ అని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు వెలువరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
PM Modi: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత విపక్ష కూటమి పేకమేడలా కూలిపోతుందని దుయ్యబట్టారు. -
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
రంజాన్ మాసంలో గాజాపై బాంబింగ్ ఆపాలని తాను ఇజ్రాయెల్ను కోరినట్లు ప్రధాని మోదీ చెప్పారు. -
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. -
గర్భిణిగా ఉన్న నా చెల్లి కడుపుపై తన్నారు: వైకాపా మూక దాడిలో గాయపడిన నూకరత్నం
ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు. -
మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్ బి’ ఉందా..? అమిత్ షా సమాధానమిదే..
Lok sabha elections: లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ రాకపోతే.. తదుపరి ప్లాన్ ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమాధానం ఇచ్చారు. -
అధికారులంతా వైకాపాకే కొమ్ముకాశారు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. -
ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచిపెట్టాలని యోచిస్తున్నామని, ఇందుకు న్యాయ సలహాలను తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు. -
వైకాపాకు 25 స్థానాలైనా దక్కవు: రఘురామకృష్ణరాజు
వైకాపాకు 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఎంపీ, ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణ రాజు అన్నారు. -
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్