ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.

Published : 04 May 2024 05:33 IST

ఈనాడు, నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. తొలిరోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా..రెండో రోజు నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో ఆ సంఖ్య ఏడుకు చేరింది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌, అలియన్స్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ తరఫున ఈడ శేషగిరిరావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాదవపెద్ది వెంకట్‌రెడ్డి, చాలిక చంద్రశేఖర్‌ తమ నామపత్రాలను నల్గొండ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా అదనపు కలెక్టరు, ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి మహేందర్‌కు అందజేశారు. ఈ నెల 9 వరకు నామినేషన్ల క్రతువు కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని