Asia Cup 2023: సూపర్-4 మ్యాచ్ల వేదికల్లో మార్పు?నేపాల్తో మ్యాచ్కు బుమ్రా దూరం
టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సెప్టెంబరు 4న నేపాల్తో జరిగే మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా అతడు శ్రీలంక నుంచి భారత్కు వచ్చాడు.
దిల్లీ: ఆసియా కప్లో ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్లు జరుగుతున్నాయి. పాకిస్థాన్లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్లు నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పాక్లో మ్యాచ్లు సజావుగానే జరుగుతున్నా శ్రీలంకలోని మ్యాచ్లకు వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి. ఇప్పటికే పల్లెకెలెలో జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అప్రమత్తమైంది. కొలంబోలో నిర్వహించాల్సిన ఐదు సూపర్-4, ఫైనల్ మ్యాచ్ల వేదికలను మార్చాలని యోచిస్తోంది. ప్రస్తుతం కొలంబోలో భారీ వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం.
ఈ ఇన్నింగ్స్తో ఇషాన్ వరల్డ్కప్ రేసులో ముందుకొచ్చాడు: రవిశాస్త్రి
మరికొన్ని రోజులపాటు కొలంబోలో కుండపోత వర్షాలు కురుస్తాయని శ్రీలంక వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ మ్యాచ్లను పల్లెకెలె లేదా దంబుల్లాకు తరలించాలని ఏసీసీ భావిస్తోంది. హంబన్తోట కూడా ఏసీసీ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతోంది. రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై ఏసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. కొలంబోలో సెప్టెంబరు నుంచి సూపర్-4 మ్యాచ్లు ప్రారంభం కావాల్సి ఉంది. ఫైనల్ మ్యాచ్ (సెప్టెంబరు 17న) కూడా కొలంబోలోనే జరగాల్సి ఉంది.
నేపాల్తో మ్యాచ్కు బుమ్రా దూరం
టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సెప్టెంబరు 4న నేపాల్తో జరిగే మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా అతడు శ్రీలంక నుంచి భారత్కు వచ్చాడు. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్తో పునరాగమనం చేసిన బుమ్రా అక్కడి నుంచి నేరుగా శ్రీలంక చేరుకున్నాడు. అయితే, బుమ్రా భారత్కు వచ్చిన విషయం గురించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అక్టోబరు, నవంబరులో ప్రపంచకప్ ఉన్నందున ఆసియా కప్లో బుమ్రాను పెద్ద జట్లతో జరిగే మ్యాచ్ల్లోనే ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నేపాల్తో మ్యాచ్కు అతడు దూరంగా ఉన్నాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. నేపాల్తో జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధించినా లేదా మ్యాచ్ రద్దయినా.. టీమ్ఇండియా సూపర్-4కు అర్హత సాధిస్తుంది. సూపర్-4 మ్యాచ్లకు బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. సూపర్-4లో భాగంగా సెప్టెంబరు 10న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడతాయి. గ్రూప్ దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోని మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..