Bhuvneshwar Kumar: భువీకి ఏమైంది..? ఇన్స్టా బయోలో ‘క్రికెటర్’ అని తీసేసి..!
టీమిండియా కింగ్ ఆఫ్ స్వింగ్ భువీ (Bhuvneshwar Kumar) ఇక ఆటకు వీడ్కోలు పలుకుతున్నాడా? తన ఇన్స్టా బయో నుంచి క్రికెటర్ పదాన్ని తొలగించడంతో నెట్టింట ఈ చర్చ మొదలైంది.
ఇంటర్నెట్డెస్క్: టీమిండియా (Team India) సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) మరోసారి వార్తల్లో నిలిచాడు. గత కొంతకాలంగా కీలక టోర్నీలకు దూరంగా ఉన్న భువీ.. తాజాగా క్రికెట్ అభిమానులను షాక్కు గురిచేశాడు. తన ఇన్స్టాగ్రామ్ బయోలో ‘క్రికెటర్ (Cricketer)’ అనే పదాన్ని తొలగించాడు. దీంతో అతడు ‘రిటైర్మెంట్ (Retirement)’ తీసుకుంటాడా? అనే సందేహాలు మొదలయ్యాయి.
అంతకుముందు భువీ ఇన్స్టా ఖాతా బయోలో ‘ఇండియన్ క్రికెటర్’ అని రాసి ఉండగా.. ఇప్పుడు కేవలం ‘ఇండియన్’ అని మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ట్విటర్లో మాత్రం క్రికెటర్ అనే పదం ఉంది. భువీ ఇన్స్టా బయోలో మార్పును గుర్తించిన కొందరు నెటిజన్లు ఆ స్క్రీన్షాట్లను సోషల్మీడియాలో షేర్ చేస్తూ అతడి రిటైర్మెంట్పై కామెంట్లు చేస్తున్నారు.
ఆటకు వీడ్కోలు పలకడానికి ముందు భువీ ఇలా హింట్ ఇచ్చాడంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అతడి కంటే గొప్ప ఇన్స్వింగర్ మరొకరు టీమ్ఇండియాలో లేరని, భువీ (Bhuvneshwar Kumar) అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించొద్దని అభిమానులు కోరుతున్నారు.
నేను జట్టులోకి తిరిగి రావాలంటే ఆ కండీషన్ పెట్టా: హార్దిక్ పాండ్య
భువి పేరు వినగానే అతడి స్వింగ్ బౌలింగే గుర్తొస్తుంది. 2012లో పాక్తో సిరీస్లో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ ‘కింగ్ ఆఫ్ స్వింగ్’.. అరంగేట్ర మ్యాచ్ల్లో మొదటి బంతికే వికెట్ తీసిన ఏకైక బౌలర్గా అరుదైన గుర్తింపు సాధించాడు. లార్డ్స్లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్ (2014)లో 82 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో మెరిశాడు. మొత్తంగా 21 టెస్టుల్లో 63... 121 వన్డేల్లో 141... 87 టీ20 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో బ్యాటర్గానూ ఆకట్టుకున్నాడు. 29 ఇన్నింగ్స్లో 552 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలున్నాయి. వ్యక్తిగతంగా అతడి ఉత్తమ స్కోరు 63 (నాటౌట్).
అయితే గత కొంతకాలంగా భువీ కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న వెస్టిండీస్ పర్యటనకు భువీని ఎంపిక చేయకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM