దిల్లీ శిబిరానికి పంత్‌

దిల్లీ క్యాపిటల్స్‌ శిక్షణ శిబిరానికి ఆ జట్టు స్టార్‌ రిషబ్‌ పంత్‌ వచ్చాడు. అతడు అక్షర్‌ పటేల్‌ తదితరులతో మాట్లాడుతున్న ఫొటోను దిల్లీ జట్టు ట్విటర్‌లో పంచుకుంది.

Updated : 15 Apr 2023 15:26 IST

దిల్లీ క్యాపిటల్స్‌ శిక్షణ శిబిరానికి ఆ జట్టు స్టార్‌ రిషబ్‌ పంత్‌ వచ్చాడు. అతడు అక్షర్‌ పటేల్‌ తదితరులతో మాట్లాడుతున్న ఫొటోను దిల్లీ జట్టు ట్విటర్‌లో పంచుకుంది. తాను వేగంగా కోలుకుంటున్నట్లు ఈ సందర్భంగా పంత్‌ తెలిపాడు. ‘‘రోజు రోజుకు మెరుగవుతున్నా. త్వరగా కోలుకుంటున్నా. జాతీయ క్రికెట్‌ అకాడమీకి వచ్చాను. అక్కడే ఉన్న దిల్లీ జట్టును కూడా కలిశాను. నా మనసంతా జట్టుతోనే ఉంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో దిల్లీ సత్తా చాటుతుందని ఆశిస్తున్నా’’ అని పంత్‌ అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు