రాజస్థాన్ ఢమాల్
యశస్వి, బట్లర్, శాంసన్ లాంటి మెరుపు బ్యాటర్లున్న జట్టు రాజస్థాన్. గత మ్యాచ్లో 150 లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించిందా జట్టు. అలాంటి జట్టు సొంతగడ్డ జైపుర్లో బెంగళూరు బౌలర్ల దెబ్బకు 59కే కుప్పకూలి పరాభవం మూటగట్టుకుంది.
59కే ఆలౌట్
బెంగళూరు ప్లేఆఫ్ ఆశలు సజీవం
యశస్వి, బట్లర్, శాంసన్ లాంటి మెరుపు బ్యాటర్లున్న జట్టు రాజస్థాన్. గత మ్యాచ్లో 150 లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించిందా జట్టు. అలాంటి జట్టు సొంతగడ్డ జైపుర్లో బెంగళూరు బౌలర్ల దెబ్బకు 59కే కుప్పకూలి పరాభవం మూటగట్టుకుంది. అత్యావశ్యక విజయంతో పాటు భారీగా నెట్రన్రేట్ కూడా సాధించిన ఆర్సీబీ.. ఐపీఎల్-16 ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. 13 మ్యాచ్ల్లో ఏడో ఓటమిని మూటగట్టుకున్న రాజస్థాన్.. దాదాపుగా ప్లేఆఫ్స్కు దూరమైంది.
బెంగళూరు అదరగొట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. ఆదివారం ఆ జట్టు 112 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్పై ఘన విజయం సాధించింది. మొదట బెంగళూరు 171/5 స్కోరు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (55; 44 బంతుల్లో 3×4, 2×6), మ్యాక్స్వెల్ (54; 33 బంతుల్లో 5×4, 3×6) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పార్నెల్ (3/10), బ్రాస్వెల్ (2/16), కర్ణ్శర్మ (2/19) దెబ్బకు రాజస్థాన్ కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది. హెట్మయర్ (35; 19 బంతుల్లో 1×4, 4×6) టాప్ స్కోరర్. 12 మ్యాచ్ల్లో ఆర్సీబీకిది ఆరో విజయం.
రాజస్థాన్ టపటపా..: లక్ష్యం 172.. ఈ సీజన్లో రాజస్థాన్ బ్యాటర్ల ఫామ్కి ఇది పెద్ద లెక్కా.. అనిపించింది. కానీ ఇన్నింగ్స్లో 10 బంతులు పడ్డాయో లేదో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అంతా టపటపానే! అటు పేస్.. ఇటు స్పిన్తో ప్రత్యర్థిని దెబ్బ మీద దెబ్బ తీసిన ఆర్సీబీ అవకాశమే ఇవ్వలేదు. గత మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన యశస్వి (0)ని సిరాజ్ తొలి ఓవర్లోనే ఔట్ చేసి పతనాన్ని మొదలుపెట్టగా.. ఆ తర్వాతి ఓవర్లో బట్లర్ (0), శాంసన్ (4)లను పెవిలియన్ చేర్చిన పార్నెల్.. రాజస్థాన్కు డబుల్ షాక్ ఇచ్చాడు. ఆపై ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో కూరుకుపోయింది. 7 ఓవర్లకు 31/6తో నిలిచిన రాయల్స్.. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ కర్ణ్శర్మ వేసిన 8వ ఓవర్లో ఎదురుదాడి చేసిన హెట్మయర్.. వరుసగా 3 సిక్స్లు బాదడంతో 19 పరుగులొచ్చాయి. ఆ తర్వాత 15 బంతుల్లో 9 పరుగులే చేసిన రాజస్థాన్.. చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులో అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. హెట్మయర్ కాక రూట్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు.
వాళ్లిద్దరే మళ్లీ..: అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్లో డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఆటే హైలైట్. గత కొన్ని మ్యాచ్లుగా స్థిరంగా ఆడుతున్న ఈ జోడీ మరోసారి సత్తా చాటింది. మొదట కోహ్లి (18)తో శుభారంభం అందించిన డుప్లెసిస్.. ఆ తర్వాత మ్యాక్స్వెల్ తోడుగా ఇన్నింగ్స్ను పటిష్ట పరిచాడు. ముఖ్యంగా ప్రత్యర్థి బౌలర్లపై మ్యాక్సీ ఎదురుదాడి చేశాడు. తనశైలిలో ర్యాంప్, స్కూప్ షాట్లతో స్కోరు పరుగులెత్తించాడు. ఈ క్రమంలో చాహల్ బౌలింగ్లో ఫైన్ లెగ్లో కళ్లుచెదిరే సిక్స్ బాదాడు. డుప్లెసిస్ కూడా కొన్ని మెరుపు షాట్లు ఆడాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్ అర్ధసెంచరీ (41 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కానీ ఎంత బాదినా 14 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 107/1 మాత్రమే. దీనికి తోడు రెండు ఓవర్ల తేడాతో డుప్లెసిస్, లొమ్రార్ (1), కార్తీక్ (0) వెనుదిరగడంతో 16 ఓవర్లకు 123/4తో ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. అర్ధసెంచరీ అయ్యాక మ్యాక్స్వెల్ కూడా వెనుదిరగడంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోరైనా చేస్తుందా అనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో అనుజ్ రావత్ (29 నాటౌట్; 11 బంతుల్లో 3×4, 2×6) బ్యాట్ ఝుళిపించడంతో 18 పరుగులు రాబట్టిన బెంగళూరు మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది.
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) యశస్వి (బి) అసిఫ్ 18; డుప్లెసిస్ (సి) యశస్వి (బి) అసిఫ్ 55; మ్యాక్స్వెల్ (బి) సందీప్ 54; లొమ్రార్ (సి) జురెల్ (బి) జంపా 1; కార్తీక్ ఎల్బీ (బి) జంపా 0; బ్రాస్వెల్ నాటౌట్ 9; అనుజ్ నాటౌట్ 29; ఎక్స్ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-50, 2-119, 3-120, 4-120, 5-137; బౌలింగ్: సందీప్శర్మ 4-0-34-1; ఆడమ్ జంపా 4-0-25-2; చాహల్ 4-0-37-0; అశ్విన్ 4-0-33-0; అసిఫ్ 4-0-42-2
రాజస్థాన్ ఇన్నింగ్స్: యశస్వి (సి) కోహ్లి (బి) సిరాజ్ 0; బట్లర్ (సి) సిరాజ్ (బి) పార్నెల్ 0; శాంసన్ (సి) అనుజ్ (బి) పార్నెల్ 4; రూట్ ఎల్బీ (బి) పార్నెల్ 10; పడిక్కల్ (సి) సిరాజ్ (బి) బ్రాస్వెల్ 4; హెట్మయర్ (సి) బ్రాస్వెల్ (బి) మ్యాక్స్వెల్ 35; జురెల్ (సి) లొమ్రార్ (బి) బ్రాస్వెల్ 1; అశ్విన్ రనౌట్ 0; జంపా (బి) కర్ణ్ 2; సందీప్ నాటౌట్ 0; అసిఫ్ (సి) కోహ్లి (బి) కర్ణ్ 0; ఎక్స్ట్రాలు 3 మొత్తం: (10.3 ఓవర్లలో ఆలౌట్) 59; వికెట్ల పతనం: 1-1, 2-6, 3-7, 4-20, 5-28, 6-31, 7-50, 8-59, 9-59; బౌలింగ్: సిరాజ్ 2-0-10-1; పార్నెల్ 3-0-10-3; బ్రాస్వెల్ 3-0-16-2; కర్ణ్శర్మ 1.3-0-19-2; మ్యాక్స్వెల్ 1-0-3-1
59
ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోరు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో రాజస్థాన్, బెంగళూరే ఉండడం విశేషం. 49 పరుగులతో ఆర్సీబీ (2017 కోల్కతాపై) అగ్రస్థానంలో ఉండగా.. రాజస్థాన్ (58, 59 పరుగులు) ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉంది. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రత్యర్థి బెంగళూరే. 2009లో రాయల్స్ 58కే ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
-
సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
-
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
-
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా