HCA: హెచ్సీఏ పెద్దలకు షాక్.. 57 క్లబ్లపై వేటు
జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ఏక సభ్య కమిటీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రక్షాళన చేపట్టింది. బహుళ క్లబ్లతో హెచ్సీఏను శాసిస్తున్న క్రికెట్ పెద్దలకు షాకిచ్చింది.
ఒక దఫా పోటీ చేయకుండా అనర్హత
జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ఏక సభ్య కమిటీ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రక్షాళన చేపట్టింది. బహుళ క్లబ్లతో హెచ్సీఏను శాసిస్తున్న క్రికెట్ పెద్దలకు షాకిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న 57 క్లబ్లపై జస్టిస్ నాగేశ్వరరావు వేటు వేశారు. హెచ్సీఏ ఎన్నికల్లో ఒక దఫా లేదా మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయా క్లబ్లు, వాటి ఎగ్జిక్యూటివ్ కమిటీలపై నిషేధం విధించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హెచ్సీఏ ఎపెక్స్ కమిటీకి నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న జస్టిస్ నాగేశ్వరరావు కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. హెచ్సీఏను గాడినపెట్టే బాధ్యతను స్వీకరించిన జస్టిస్ నాగేశ్వరరావు.. అంతకుముందు సుప్రీంకోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకున్నారు. 80 క్లబ్లను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది, వారి కుటుంబ సభ్యులు హెచ్సీఏ ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నట్లు పర్యవేక్షక కమిటీ గుర్తించింది. జీహెచ్ఎంసీకి చెందిన 21 క్లబ్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు పేర్కొంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ నాగేశ్వరరావు.. ఆయా క్లబ్ల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధుల నుంచి వివరణ తీసుకున్నారు. కొందరు వ్యక్తులు బహుళ క్లబ్లు కలిగి ఉండటాన్ని గుర్తించిన జస్టిస్ నాగేశ్వరరావు వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్న 57 క్లబ్లపై అనర్హత వేటు వేశారు. ఆ క్లబ్లు, వాటి ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో ఉన్నవాళ్లు ఒక దఫా లేదా మూడేళ్ల పాటు హెచ్సీఏ ఎన్నికలకు దూరమైనట్లు ప్రకటించారు. ఈ క్లబ్లు రానున్న ఎన్నికల్లో పాల్గొనకుండా, ఓటు హక్కు వినియోగించకుండా నిషేధం విధించారు. దీంతో హెచ్సీఏ అధ్యక్ష, కార్యదర్శితో సహా అత్యున్నత పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది రానున్న ఎన్నికలకు దూరమయ్యారు.
శేష్ నారాయణ, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, ప్రకాష్ చంద్ జైన్, అర్షద్ అయూబ్, వంకా ప్రతాప్, విక్రమ్ మాన్సింగ్, స్వరూప్, విజయానంద్, జాన్ మనోజ్ సహా కీలక వ్యక్తులపై వేటు పడింది. జస్టిస్ నాగేశ్వరరావు ఉత్తర్వుల నేపథ్యంలో రానున్న హెచ్సీఏ ఎన్నికల్లో 158 (మొత్తం 215) క్లబ్లు ఓటు హక్కు వినియోగించుకోన్నాయి. ఇక తమ క్లబ్లన్న జీహెచ్ఎంసీ వాదనను జస్టిస్ నాగేశ్వరరావు తోసిపుచ్చారు. క్లబ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో జీహెచ్ఎంసీ విఫలమైంది. జీహెచ్ఎంసీ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిచ్చిన జస్టిస్ నాగేశ్వరరావు.. ఆ క్లబ్ల ప్రతినిధులకు యాజమాన్య హక్కులు ప్రసాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
సెలవుల్లో అమెరికా వెళ్లేందుకు తానెంతో ఇష్టపడతానంటూ టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. అందుకు గల కారణాలను వివరించాడు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
మెగా లీగ్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఐదు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. -
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న వేళ.. మరో ఆసక్తికర మ్యాచ్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. -
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
మ్యాచులన్నీ ముగిసినా.. ఇటు బయటకు వెళ్లలేని పరిస్థితి. అటు నాకౌట్ దశకు అర్హత దక్కుతుందో తెలియని సంకటస్థితి దిల్లీ జట్టుకు ఉంది. -
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
ద్రవిడ్ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కోచ్ పదవి నుంచి వైదలగాలని భావిస్తున్నాడు. కనీసం టెస్టు జట్టుకు కూడా అతడు కోచ్గా ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. -
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా సంభాషణ వైరల్గా మారిపోయింది. ఆ పరిణామాలపై లఖ్నవూ కోచ్ స్పందించాడు. -
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
లఖ్నవూకు ఈ సీజన్లో ఏడో ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్కు వెళ్దామనే ఆశలకు బ్రేక్ పడేలా ఉంది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
హార్దిక్ నాయకత్వంపై విమర్శలు చేసిన విదేశీ మాజీ క్రికెటర్లను గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఐపీఎల్లో ఆ ఇద్దరి పాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?