విరాట్ విఫలమైనా బెంగళూరుకు శుభవార్త!
పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటికీ ముంబయిపై విజయం సాధించిన బెంగళూరును మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభినందించారు. సారథి విరాట్ కోహ్లీ విఫలమైనప్పటికీ 200 పరుగుల మైలురాయిని అందుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా...
దుబాయ్: పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటికీ ముంబయిపై విజయం సాధించిన బెంగళూరును మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభినందించారు. సారథి విరాట్ కోహ్లీ విఫలమైనప్పటికీ 200 పరుగుల మైలురాయిని అందుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడని కొనియాడారు. ముంబయి×బెంగళూరు మ్యాచ్పై ఆయన తన యూట్యూబ్ ఛానల్ ‘ఆకాశ్వాణి’లో మాట్లాడారు.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో కోహ్లీ 3 పరుగులే చేశాడు. నిజానికి అతడు 3 మ్యాచుల్లో కలిపి 18 పరుగులకే పరిమితమయ్యాడు. తన లయ అందుకోలేదు. ఈ పోరులో ఆరంభంలో అద్భుతంగా ఆడిన బెంగళూరు ఫించ్, కోహ్లీ వరుసగా ఔటవ్వడంతో ఇబ్బంది పడింది. ఒకానొక దశలో 180 స్కోర్ చేయడమూ కష్టమే అనిపించింది. అయితే ఏబీ డివిలియర్స్, శివమ్ దూబె భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి ముంబయికి 202 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. ఛేదనలో రోహిత్ సేన 201కే పరిమితం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసిన సంగతి తెలిసిందే.
‘కోహ్లీ ఫామ్పై ఆందోళన నెలకొనడం వాస్తవమే. అయితే బెంగళూరుకు ఒక శుభవార్త ఉంది. విరాట్ భాగస్వామ్యం లేకుండానే ఆ జట్టు 200 పరుగులు సాధించింది. ఇక కోహ్లీ ఫామ్ అందుకుంటే ఏం జరగనుంది? ఏమవుతుందో నేను ఊహించి చెప్తాను. వాళ్ల బ్యాటింగ్ భీకరంగా మారుతుంది’ అని ఆకాశ్ అన్నారు. ‘బెంగళూరు సారథి ఔటయ్యాక ఏబీ డివిలియర్స్ తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. దూబె బంతిని బలంగా బాదాడు. బుమ్రాను ఎదుర్కొని 200 మైలురాయి అందుకున్నారు’ అని పేర్కొన్నారు.
ఛేదనలో విధ్వంసం సృష్టించిన యువ క్రికెటర్ ఇషాన్ను ఆకాశ్ ప్రశంసించారు. ‘మ్యాచ్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇషాన్దే. ఎందుకంటే అతడి ఆటతీరు అలావుంది. సీజన్లో తొలి మ్యాచ్ కావడంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఆ తర్వాత హిట్టింగ్ మొదలుపెట్టాడు. నవదీప్, ఉదాన, యూజీ బౌలింగ్లో సిక్సర్లు బాదేశాడు. పంత్, శాంసన్తో పాటు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు పోటీపడుతున్నట్టు చాటిచెప్పాడు’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.