Jonty Rhodes: అభిమానితో నెట్టింట వార్.. క్షమించమంటూనే క్లారిటీ ఇచ్చేసిన జాంటీ రోడ్స్
సోషల్ మీడియా వేదికగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే?
ఇంటర్నెట్ డెస్క్: లఖ్నవూ ఫీల్డింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో రోడ్స్ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని ఓ క్రికెట్ అభిమాని ఆరోపణలు గుప్పించడం సంచనలంగా మారింది. చివరికి తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. అలా అనిపిస్తే క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధమేనని రోడ్స్ వెల్లడించాడు. ఈ వివాదంపై వివరణ ఇస్తూ పోస్టు పెట్టాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే?
‘‘డే 10. లఖ్నవూ మేనేజ్మెంట్ స్పందించేవరకూ ట్వీట్లు చేస్తూనే ఉంటా’’ అని సదరు అభిమాని తొలుత పోస్టు పెట్టాడు.
‘‘బ్రదర్, జీవితం ఎంతో ఉంది. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. అందుకు అభినందనలు. అయితే.. ’’ అంటూ రోడ్స్ సమాధానం ఇచ్చాడు.
రోడ్స్ పోస్టుకు సదరు అభిమాని స్పందిస్తూ.. ‘‘అతడు (రోడ్స్) మామూలుగా సమాధానం ఇచ్చి ఉండొచ్చు. ఒక అభిమానిగా ట్వీట్ చేశా. నేను ఎక్కడా దుర్భాషలాడలేదు. ద్వేషం వ్యాప్తి చేసేలా కామెంట్ చేయలేదు. నా జట్టు నుంచి సమాధానం రావాలని ఆశిస్తూ ట్వీట్ చేయలేకపోతే ఇంకెందుకు? వారిని ఆనందంగా ఉంచడానికి మేం ప్రయత్నిస్తే పనీపాటా (జాబ్లెస్) లేనివాళ్లుగా మమ్మల్ని కోచ్ పరిగణించడం సరైంది కాదు. ఇప్పటివరకు ఉన్న గౌరవమంతా పోయింది. ఇకపై లఖ్నవూకు మద్దతుగా ఉండను’’ అంటూ పోస్టు పెట్టడంతో అది నెట్టింట వైరల్గా మారింది. కొందరు జాంటీ రోడ్స్కు అనుకూలంగా పోస్టులు పెడుతుంటే.. మరికొందరు మాజీ క్రికెటర్ తీరును తప్పుబట్టారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రోడ్స్ వివరణ ఇస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు.
అలా అనలేదు: రోడ్స్
‘‘నిన్ను ఎప్పుడు ‘జాబ్లెస్’ అని అన్నానో దయచేసి చెప్పు. నీవు నిజాయతీగా స్పందించకూడదనుకుంటే మాత్రం నీ కౌంట్డౌన్లో నన్ను ట్యాగ్ చేయకుండా ఉండాల్సింది. ఇటీవల నేను లఖ్నవూలో యాసిడ్ బాధితులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నా. ఆ బాధిత యువతులు దాదాపు ఏడేళ్ల నుంచి న్యాయం కోసం పోరాడి నేరస్థులపై విజయం సాధించారు. వారికి, నాకు చాలా సమయం ఉంది. వారేమీ మనల్ని పెద్దవేం అడగలేదు. తోటి మనుషులుగా చూడమని మాత్రమే కోరుతున్నారు. ఇప్పటికే సమాజం కోసం కష్టపడుతున్నారు. ఇప్పుడు 1500 మంది ఉన్నారు. ఇంకా కౌంట్డౌన్ కొనసాగుతోంది. ఇలాంటి వారి గురించి ఆలోచించాలి. నీ (సదరు అభిమాని) ట్వీట్ కౌంట్డౌన్ను సమస్యగా మార్చడం కాదు. ఏదిఏమైనప్పటికీ నువ్వు బాధపడితే నన్ను క్షమించు’’ అని జాంటీ రోడ్స్ ఎక్స్లో పోస్టు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..