Ashutosh Sharma: ఆ ప్రముఖ కోచ్ వల్ల కెరీర్లో కుంగుబాటుకు గురయ్యా: అషుతోష్ సంచలన వ్యాఖ్యలు
ఏ క్రికెటర్ కెరీర్లోనైనా కోచ్ పాత్ర అత్యంత కీలకం. టాలెంట్ ఉండి.. అద్భుతమైన ప్రదర్శన చేసినా అవకాశాలు కల్పించకపోతే మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. అలాంటి పరిస్థితే పంజాబ్ యువ క్రికెటర్కు ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్పై భారీ లక్ష్య ఛేదనలో కీలక ఇన్నింగ్స్ ఆడిన పంజాబ్ యువ క్రికెటర్ అషుతోష్ సంచలన విషయం వెలుగులోకి తెచ్చాడు. 2020-22 సీజన్లో ఓ కోచ్ వల్ల కెరీర్లో తీవ్ర కుంగుబాటుకు గురయ్యానని.. అందుకే మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఇష్టపడలేదని వ్యాఖ్యానించాడు. అదే తన జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా పేర్కొన్నాడు. గుజరాత్పై కేవలం 17 బంతుల్లోనే 31 పరుగులు చేసిన అషుతోష్ పంజాబ్ను గెలిపించాడు. దీంతో అతడి పేరు అభిమానుల్లో మారుమోగుతోంది.
‘‘2020 సీజన్లో మంచి ప్రదర్శనే చేశా. కానీ, మధ్యప్రదేశ్కు అప్పుడే కొత్త కోచ్ వచ్చారు. జట్టు సభ్యుల్లోని కొందరిపై అతడికి బలమైన నమ్మకం ఉంది. మరికొందరు పెద్దగా నచ్చలేదు. నేను సన్నాహక మ్యాచ్లో 45 బంతుల్లోనే 90 పరుగులు చేశా. ఆ తర్వాత జిమ్కు వెళ్లి హోటల్ రూమ్కు వచ్చా. కానీ, జట్టులో నుంచి నన్ను తప్పించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యా. నేను చేసిన తప్పేంటో కూడా ఎవరూ చెప్పలేదు. అంతకుముందు సీజన్లో ముస్తాక్ అలీ ట్రోఫీలో నేను ఆరు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేశా. తర్వాత నన్ను కనీసం మైదానంలోకి కూడా అనుమతించలేదు. ఆ నిర్ణయంతో కుంగిపోయా’’ అని వ్యాఖ్యానించాడు. అషుతోష్ ఉటంకించిన కోచ్ చంద్రకాంత్ పండిత్గా క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత క్రికెట్లో పండిత్కు అద్భుతమైన కోచ్గా పేరుంది. అయితే, గతంలో నమీబియా ఆటగాడు డేవిడ్ వీజ్, మధ్యప్రదేశ్ మాజీ పేసర్ గౌరవ్యాదవ్ కూడా పండిత్ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
అమయ్ సర్ వల్లే మళ్లీ క్రికెట్లోకి..
‘‘నేను 12 ఏళ్ల నుంచి ఎంపీసీఏ అకాడమీలో శిక్షణ పొందా. కోచ్ అమయ్ ఖురాసియా నా నైపుణ్యాలు మెరుగయ్యేందుకు చాలా కృషి చేశారు. మానసికంగా ఇబ్బంది పడినప్పుడు ఆయన సలహాలు తీసుకొనేవాడిని. ప్రతీ మ్యాచ్కు ముందు అమయ్ సర్తో మాట్లాడతా. గుజరాత్ మ్యాచ్కు ముందూ సంభాషించా. శిఖర్ ధావన్ నుంచి టిప్స్ అడిగి తెలుసుకున్నా. సంజయ్ బంగర్ షాట్ల ఎంపికలో సాయంగా నిలిచారు’’ అని అషుతోష్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?