Rishabh Pant: సోనెట్ క్రికెట్ క్లబ్.. ఆ నిర్ణయం తీవ్రంగా బాధించింది: రిషభ్ పంత్
తమను ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దిన క్లబ్కు కష్టం రావడంతో టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) స్పందించాడు. తన ఆవేదనను తెలియజేస్తూ ట్విటర్ వేదికగా పోస్టు పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలోని వెంకటేశ్వర కళాశాలలో ఉంటున్న సోనెట్ క్లబ్ను తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. టాప్ క్రికెటర్లను అందించిన క్లబ్పై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నాడు. తాను కూడా ఇదే క్లబ్ నుంచి క్రికెటర్గా వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. గతేడాది రోడ్డు ప్రమాదం కారణంగా గాయపడిన రిషభ్ పంత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుత ఐపీఎల్కూ దూరమయ్యాడు. సోనెట్ క్లబ్కు సంబంధించిన అంశంపై ఓ పత్రికా విలేకరి చేసిన ట్వీట్పై పంత్ స్పందించాడు.
ద్రోణాచార్య అవార్డు గ్రహీత, కోచ్ తారక్ సిన్హా మార్గదర్శకంలో క్రికెటర్లు తయారుకాగా.. రిషభ్ పంత్ కూడా అతడి వద్దే క్రికెట్ పాఠాలను నేర్చుకున్నాడు. ‘‘ఎంతోమంది అంతర్జాతీయ క్రికెటర్లను అందించిన నా క్లబ్ పరిస్థితిని చూస్తే బాధేస్తోంది. సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న క్లబ్ను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం సరైందికాదు. నా క్రికెట్ కెరీర్ను పదును పెట్టడంలో క్లబ్ కీలక పాత్ర పోషించింది. నాతో సహా చాలా మంది ఆటగాళ్లు దాన్ని సొంత ఇల్లులా భావిస్తున్నాం. వెంకటేశ్వర కళాశాల నిర్దేశించిన నియమాలను పాటిస్తున్నాం. దయచేసి వెంకటేశ్వర కళాశాల గవర్నింగ్ బాడీ ఆ డెసిషన్ను వెనక్కి తీసుకోవాలి. సోనెట్ క్లబ్ను కేవలం ఒక క్లబ్లా కాకుండా ఒక ప్రతిష్ఠాత్మక సంస్థగా పరిగణించాలి. మరింత మంది క్రికెటర్లకు అది హోమ్గా మారుతుంది ’’ అని రిషభ్ పంత్ ట్వీట్ చేశాడు.
వీరంతా అక్కడి నుంచే..
సీకే నాయుడు ట్రోఫీకి దిల్లీ జూనియర్ జట్టు తరఫున సెలెక్ట్ కాకపోవడంతో తారక్ సిన్హా 1969లో సోనెట్ క్లబ్ను ప్రారంభించారు. అప్పుడు ఆయన వయసు 19 ఏళ్లు కావడం గమనార్హం. శ్రీ వెంకటేశ్వర కళాశాల వేదికగా క్లబ్ను ఏర్పాటు చేసిన తారక్ యువ క్రికెటర్లకు తర్ఫీదు ఇచ్చారు. మాజీ ఆటగాళ్లు మనోజ్ ప్రభాకర్, ఆశిశ్ నెహ్రా, ఆకాశ్ చోప్రాతోపాటు ప్రస్తుత తరంలో పంత్, ఆయుష్ బదోని, హృతీక్ షోకీన్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్ శిక్షణ పొందారు. టీమ్ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కూడా ఆయన శిష్యురాలే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..