Sunil Gavaskar: టీమ్ఇండియా ముందున్న ఏకైక సమస్య అదే..
భారత సారథి రోహిత్ శర్మ ఫామ్ కలవరానికి గురిచేస్తోందని, ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య ఇదేనని భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్, హార్దిక్ పాండ్య సమయోచిత ఇన్నింగ్స్తో పాక్పై భారత జట్టు విజయం సాధించి ఈ టీ20 ప్రపంచకప్లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. అయితే, కొద్దిరోజులుగా విఫలమవుతూ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లోనూ రాణించలేదు. 7 బంతులు ఎదుర్కొని కేవలం 4 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ సైతం నాలుగు పరుగులే చేశాడు. కానీ ఈ మ్యాచ్లో విజయంతో ఈ విషయంపై ఎవరూ మాట్లాడలేదు. కాగా ఈ అంశంపై భారత మాజీ కెప్టెన్, క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గావస్కర్ తాజాగా స్పందించాడు. రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం టీమ్ఇండియాను ఆందోళనకు గురిచేస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
‘ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్ శర్మ ఫామ్. కొద్దిరోజులుగా అతడి స్థాయికి తగినట్లు ఆడటంలేదు. అతడు ఆడితే ఇతరులకు బ్యాటింగ్ చేయడం ఎంతో సులువవుతుంది. మంచి ఓపెనింగ్ ఇస్తే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి ఉండదు. వచ్చీ రాగాగే మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా మంచి స్కోర్ సాధించవచ్చు’ అని అన్నాడు. తదుపరి జరిగే మ్యాచ్ల్లో మొదటి 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఉంటడమే కీలకం అని వ్యాఖ్యానించాడు. నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా.. వికెట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గావస్కర్ సూచించాడు. కాగా భారత్ గురువారం తన తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.