Irradiation: పదార్థాలు చెడకుండా..
ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి.
ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి. అతి శీతల వాతా వరణంలో భద్ర పరచటం, పాలను పాశ్చరైజ్ చేయటం తెలిసిందే. వీటి కోవకు చెందిన మరో ప్రక్రియ ఇరేడియేషన్. ఇటీవల మనదేశం ఉల్లిగడ్డలు త్వరగా కుళ్లిపోకుండా ఈ ప్రక్రియను వాడాలని నిర్ణయించింది. ఇంతకీ ఇరేడియేషన్ అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది?
ఇరేడియేషన్ అంటే ఆహార పదార్థాలను అయోనైజింగ్ రేడియేషన్ ప్రభావానికి గురిచేయటం. దీంతో పదార్థాలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. ఇదేమీ కొత్త పద్ధతి కాదు. మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలను ఎండలో ఎండించి, నిల్వ చేయటం అనాదిగా ఉన్నదే. ఇదీ ఒకరకం రేడియేషన్ పద్ధతే. అయోనైజింగ్ రేడియేషన్ విధానంతో ఆహార పదార్థాలను నిల్వ చేయటం వందేళ్ల క్రితమే.. 1920ల్లోనే మొదలైంది. అనంతరం 1950ల్లో అమెరికా సైన్యం ఆహారం ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండటానికి స్వల్ప, అధిక మోతాదు ఇరేడియేషన్తో ప్రయోగాలు నిర్వహించింది. ఇప్పుడు ఈ ప్రక్రియ వాడకానికి 40 దేశాలు అనుమతించాయి. ఇరేడియేషన్తో పదార్థాలు రేడియోధార్మికతకు గురవుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ ఇది చాలా సురక్షితం. వండటం వంటి ఇతర నిల్వ పద్ధతుల్లో వెలువడే రసాయనాలే ఇరేడియేషన్ ప్రక్రియలో వెలువడతాయి. నిర్ణీత మోతాదులో ఇరేడియేట్ చేసిన పదార్థాలు తినటానికి సురక్షితమైనవేనని, పోషకాలేవీ పోవని ప్రముఖ సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియతో హానికర బ్యాక్టీరియా ఏమీ ఉద్ధృతం కాదని తేలింది. పచ్చి మాంసంలో ఇ-కొలి వంటి హానికర బ్యాక్టీరియా నిర్మూలనకు దీన్ని మించిన పద్ధతి లేదనీ బయటపడింది. అందువల్ల ఆహార పదార్థాలు కుళ్లిపోవటంతో పుట్టుకొచ్చే జబ్బులను తగ్గించటానికిది బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఎలా చేస్తారు?
గామా కిరణాలు లేదా అత్యధిక శక్తితో కూడిన ఎలక్ట్రాన్ పుంజం లేదా శక్తిమంతమైన ఎక్స్రేలను ఆహార పదార్థాల మీద పడేలా చేయటం ఇరేడియేషన్ ప్రక్రియలో కీలకాంశం. పదార్థంలోని అన్ని భాగాలకూ కనీస మోతాదు రేడియేషన్ అందేలా చూడటం ప్రధాన లక్ష్యం. ఎలక్ట్రాన్ బీమ్, ఎక్స్రే టెక్నాలజీతో కూడిన ఇరేడియేషన్ ప్రక్రియలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి. యాక్సిలరేటర్ వ్యవస్థ నుంచి అత్యధిక శక్తితో కూడిన ఎలక్ట్రాన్ పుంజం పుట్టుకొస్తుంది. ఇది అయస్కాంత పుంజం స్కానర్ సాయంతో పదార్థం గుండా సమానంగా ప్రసరిస్తుంది. నేరుగా ఎలక్ట్రాన్ ఇరేడియేషన్ కోసం పలుచటి ఎక్జిట్ విండో(టీఐ)ను ఉపయోగిస్తారు. హై-జడ్ కన్వర్టర్తో ఎక్స్రేలను సృష్టిస్తారు. పదార్థాన్ని కచ్చితంగా నియంత్రిస్తూ స్కాన్డ్ పుంజం నుంచి గుండా వెళ్లేలా చేస్తారు. మైక్రోవేవ్ ఒవెన్లో పదార్థం నుంచి మైక్రో తరంగాలు వెళ్లినట్టుగానే ఈ కిరణాలు ప్రసరిస్తాయి. కానీ పదార్థం పెద్దగా వేడి కాదు. గామా కిరణాల ప్రభావంతో పదార్థం రేడియో ధార్మికతకు గురికాదు. ఎలక్ట్రాన్ పుంజాలు, ఎక్స్రేలు విద్యుత్తు సాయంతో పుట్టుకొస్తాయి. వీటిని ఆన్, ఆఫ్ చేయొచ్చు. వీటికి రేడియోధార్మిక పదార్థాలు అవసరం లేదు. ఇరేడియేషన్ మూలంగా పదార్థాలు కుళ్లిపోయేలా చేసే కీటకాలు, శిలీంద్రాలు, బ్యాక్టీరియా, కొన్ని విషపూరిత బ్యాక్టీరియా చనిపోతాయి. అయితే ఈ ప్రక్రియ వైరస్లను చంపలేదు.
పదార్థాల మీద ప్రభావం
పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి కొన్ని పదార్థాలను ఇరేడియేషన్ చేయటం కుదరదు. ఎందుకంటే ఇరేడియేషన్తో వీటి రుచి, ఆకారం మారతాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యాల పదార్థాలు, మసాలాలు, మాంసం వంటి వాటిని ఇరేడియేట్ చేయొచ్చు. దీంతో పదార్థాల రసాయన స్వభావం పెద్దగా ఏమీ మారదు. అయితే ఇది బి విటమిన్ల మీద కొంతవరకు ప్రభావం చూపుతుంది కాబట్టి కొన్ని పదార్థాల్లో పోషకాల మోతాదులు తగ్గొచ్చు. ఈ నష్టం కూడా వండినప్పుడు లేదా సంప్రదాయ పద్ధతిలో నిల్వ చేసినప్పుడు తగ్గేంత స్థాయిలోనే ఉంటుంది.
ఏంటీ ప్రయోజనాలు
ఇరేడియేషన్తో చాలా ప్రయోజనాలే ఉంటాయి.
- పదార్థాలు త్వరగా కుళ్లిపోకుండా ఉంటాయి.
- వ్యర్థం కావటం తగ్గుతుంది.
- క్యాంపిలోబ్యాక్టర్, సాల్మొనెల్లా, ఇ.కొలి, లిస్టీరియా వంటి సూక్ష్మక్రిములతో (ఇవి ముఖ్యంగా మాంసాహారంలో ఉంటాయి) వ్యాపించే జబ్బుల ముప్పు తగ్గుతుంది.
- పురుగుమందులు వాడాల్సిన అవసరం తగ్గుతుంది.
- నిల్వ కారకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి అడిటివ్స్ అంతగా కలపాల్సిన అవసరముండదు.
- ఆహార పదార్థాల్లో కనిపించకుండా ఉండే కీటకాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాపించటం తగ్గుముఖం పడుతుంది.
- కొన్నిరకాల బ్యాక్టీరియాను చంపటానికి విషపూరిత రసాయనాలతో శుద్ధి చేసే అవసరం తప్పుతుంది.
- దిగుమతి చేసుకున్న పండ్లు, ధాన్యాలు, కూరగాయలను క్రిమిరహితం చేయటానికి ప్రస్తుతం ఓజోన్ను తగ్గించే వాయువులతో శుద్ధి చేస్తున్నారు. ఇరేడియేషన్తో ఇలాంటి వాయువుల వినియోగం తగ్గుతుంది.
- బంగాళాదుంపలు, ఉల్లిగడ్డల వంటివి మొలకెత్తటం తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వచ్ఛ ఒలింపిక్స్
ఒలింపిక్ క్రీడలకు పారిస్ నగరం సమాయత్తమైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, క్రీడాభిమానులతో విశ్వ నగరం కొత్త శోభలు సంతరించుకుంటోంది. -
వినూత్న ఫొటోనిక్స్
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలక్ట్రాన్ల పాత్ర కీలకం. ఇవి ఒక చోటు నుంచి మరో చోటుకు డేటాను చేరవేయటం వంటి దగ్గరి దారులకు బాగా ఉపయోగపడతాయి. -
1పాస్వర్డ్ మారింది
పలు కొత ఫీచర్లతో 1పాస్వర్డ్ భారీగా అప్డేట్ అయ్యింది. మాస్టర్ పాస్వర్డ్ను మరిచిపోయినా అకౌంట్ను రికవరీ చేసుకునే వెలుసుబాటూ కల్పించింది. -
నవ్వు శాస్త్రం
నవ్వటం ఒక భోగం! అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నవ్వటమనేది కనుమరుగవుతోంది. రోజుకు ఒక్కసారైనా నవ్వనివారు ఎందరో. -
ఎక్కువ సిమ్లు తీసుకున్నారా?
నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక్క సిమ్ కార్డు సరిపోవటం లేదు. ఆఫీసు వ్యవహారాలకు ఒకటి, సొంత పనులకు ఒకటి, కుటుంబ పనులకు మరోటి.. ఇలా బోలెడన్ని సిమ్లు ఎడాపెడా తీసేసుకుంటున్నారు. -
ఆన్లైన్ నేరాల మీద చక్షువు
నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. -
మనిషిలా మరమనుషులు!
విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటారు. ఇవి రోజురోజుకీ ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే.. మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు. -
సూపర్ పరిజ్ఞానాలు
సాంకేతిక పరిజ్ఞాన (టెక్నాలజీ) రంగం శరవేగంగా సాగుతోంది. నిన్నటి పద్ధతులు నేడు పాత పడిపోతున్నాయి. వాటి స్థానంలో వినూత్న పరిజ్ఞానాలు వచ్చి చేరుతున్నాయి. -
ఏఐ సాయంతో ఉద్యోగం!
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందని, దీని మూలంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వెల్లువెత్తటం చూస్తున్నదే. -
ఏఐ సోషల్ లోకం!
సామాజిక మాధ్యమ ప్రియులకు శుభవార్త. మరో వినూత్న సోషల్ మీడియా యాప్ ఆరంభమైంది. దీని పేరు బటర్ఫ్లయిస్. మామూలు యూజర్లతోనే కాకుండా కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించుకున్న పాత్రలతోనూ సంభాషణలు జరపటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. -
గ్రహాంతర జీవులు మనమధ్యే!
గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలాకాలంగా అన్వేషిస్తున్నాం. కానీ ఇంతవరకూ కచ్చితమైన జాడేదీ కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్లు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. -
విద్యుత్తు మోటారు ఎలా తిరుగుతుంది?
విద్యుత్తుతో పనిచేసే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజూ వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి. -
యాపిల్ ఏఐ శకం
యాపిల్ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) దిశగా తొలి అడుగులు వేసింది. ఏటా నిర్వహించే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈసారి దీనికి పెద్ద పీట వేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరిట సొంత ఏఐ పరిజ్ఞానాన్ని పరిచయం చేయటంతో పాటు డిజిటల్ అసిస్టెంట్ అయిన సిరికి సైతం ఏఐ సొబగులు అద్దింది. -
నవ మాయా దర్పణం
మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలక బోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో. -
ఫైళ్ల అంశాలు ప్రివ్యూలో
డెస్క్టాపో, ల్యాప్టాపో.. ఏదైనా పీసీలో బోలెడన్ని ఫైళ్లు. రోజూ కొత్తవి ఎన్నో వచ్చి చేరుతుంటాయి. కొన్నిసార్లు పేర్లనూ మరచిపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు. -
వాతావరణ మార్పును వింటారా?
డేటా అనగానే అంకెలు, గ్రాఫ్లే గుర్తుకొస్తాయి. దీన్ని సంగీతంగా మారిస్తే? జపాన్ శాస్త్రవేత్త హిటోరీ నగాయ్ అలాంటి విచిత్రమే చేసి చూపించారు. అర్కిటిక్, అంటార్కిటికా నుంచి 30 ఏళ్లుగా ఉపగ్రహాలు సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఆరు నిమిషాల పాటగా మార్చారు. -
ఫోన్ భద్రంగా..
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! -
కార్చిచ్చు కహానీ!
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. -
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం