ఫోన్ భద్రంగా..
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ!
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! మనలో చాలామంది ఆండ్రాయిడ్ ఫోన్లనే ఎక్కువగా వాడుతుంటారు. వీటి రక్షణ కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
దగ్గరే ఉంచుకోవాలి
ఫోన్ను సురక్షితంగా ఉంచుకోవటానికి అత్యుత్తమైన మార్గం దగ్గరే పెట్టుకోవటం. హోటళ్లకు వెళ్లినప్పుడు పర్సును టేబుల్ మీద పెట్టం కదా. అలాగే బయటకు వెళ్లినప్పుడు ఫోన్ను కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు. వాడనప్పుడు జేబులో గానీ చేతి సంచీలో గానీ పెట్టుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ఫోన్ మీద ఓ కన్నేసి ఉంచాలి. చవక ఫోన్ అయినా కూడా దీన్ని మరవరాదు. ఒకసారి ఫోన్ పోయిందంటే దానిలోని వివరాలు ఇతరులకు చిక్కినట్టే. ఇది గోప్యతకు భంగం కలిగిస్తుందని మరవరాదు.
యూజర్ ప్రొఫైల్ సెట్
కుటుంబసభ్యులో, స్నేహితులో.. ఇతరులెవరి చేతికి ఫోన్ ఇస్తున్నా యూజర్ ప్రొఫైల్ ఆప్షన్ ఎంచుకోవటం మంచిది. ఇది ప్రతి ఒక్కరికీ తమదైన భద్రత కల్పిస్తుంది. దీన్ని సెట్ చేసుకుంటే కొత్త యూజర్ను యాడ్ చేసుకొని ఫోన్ను వారికి ఇవ్వచ్చు. వారి ఈమెయిల్ ఖాతా, యాప్స్, ఫొటో స్టోర్ విడిగా ఉంటాయి. ఇలా ఇద్దరి వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయి. ఒకవేళ కొద్ది నిమిషాల వరకే ఎవరికైనా ఫోన్ ఇస్తున్నట్టయితే గెస్ట్ ప్రొఫైల్ను సెట్ చేసుకోవాలి. దీని ద్వారా ఆ సమయం మేరకు ఖాతాను భద్రంగా ఉంచుకోవచ్చు. మొత్తం వ్యక్తిగత డేటా వారి కంటపడకుండా చూసుకోవచ్చు. సెటింగ్స్ ద్వారా సిస్టమ్లోకి వెళ్లి.. మల్టిపుల్ యూజర్స్ బటన్ను ఆన్ చేసుకోవాలి. అనంతరం యాడ్ యూజర్ను ఎంచుకొని, ఓకే మీద ట్యాప్ చేయాలి. కొత్త యూజర్కు పేరు పెట్టుకోవాలి. అవసరమైతే ఫొటో జత చేసుకోవచ్చు. ఎవరికైనా ఫోన్ ఇచ్చేటప్పుడు స్విచ్ యూజర్ మీద ట్యాప్ చేసి సెటప్ నౌ ఎంచుకుంటే సరి. కొన్ని ఫోన్లలో ఈ సెటింగ్ విధానం భిన్నంగా ఉండొచ్చు.
యాప్స్ లాకప్
స్క్రీన్ లాక్ చేసుకోవటమే కాకుండా ముఖ్యమైన యాప్లను విడివిడిగా లాక్ చేసుకోవటమూ ముఖ్యమే. ఎవరైనా పాస్వర్డ్ తెలుసుకొని ఫోన్ను ఓపెన్ చేసినా యాప్లను ఓపెన్ చేయకుండా ఇది కాపాడుతుంది. ఇందుకోసం ఉచితంగా అందుబాటులో ఉండే యాప్ లాక్ వంటి సాధనాల సాయమూ తీసుకోవచ్చు. అన్నీ కాకపోయినా ఈమెయిల్, ఫైల్ మేనేజర్ వంటి రహస్య సమాచారంతో కూడిన యాప్లను లాక్ చేసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. కొన్ని పరికరాల్లో ప్రత్యేకించి లాక్డ్ ఏరియా వంటి ఫీచర్లూ ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైన యాప్లను భద్రపరచుకోవచ్చు. అదనంగా మరో సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరముండదు.
ఫైండ్ మై డివైస్
పొరపాటున ఫోన్ పోయినట్టయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. ముందుగా సెటింగ్స్లోకి వెళ్లి, సెక్యూరిటీ ఆప్షన్ ద్వారా ప్రైవసీలోకి వెళ్లాలి. ఫైండ్ మై డివైస్ను ఆన్ చేయాలి. చాలా ఫోన్లలో ఇది ఆఫ్ చేసి ఉంటుంది. దీని కింద ఫైండ్ మై డివైస్, వెబ్, గూగుల్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ ఫైండ్ మై డివైస్ ఫోన్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోనట్టయితే ప్లే స్టోర్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే గూగుల్ మ్యాప్ మాదిరిగా కనిపిస్తుంది. ఇది పనిచేయాలంటే ఫోన్లో లొకేషన్ ఆన్ చేసి ఉంచాలి. అప్పుడే మ్యాప్లో ఫోన్ ఉన్నచోటు కనిపిస్తుంది. ఇందులో ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్, ఎరేజ్ డివైస్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో ఎరేజ్ డివైస్ బూడిద రంగులో ఉంటుంది. ఎందుకంటే దీన్ని అదే పరికరం నుంచి ఉపయోగించుకోలేం. వెబ్ లేదా ఇతర పరికరం ద్వారానే ఎరేజ్ చేయటానికి వీలుంటుంది.
- ఫోన్ కనిపించనప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు వెబ్ ఇంటర్ఫేస్తో గుర్తించొచ్చు. ముందుగా https://www.google.com/android/find లోకి వెళ్లాలి. గూగుల్ ఖాతాలోకి సైన్ ఇన్ అయ్యాక ఎడమ వైపున మన ఫోన్ కనిపిస్తుంది. ప్లే సౌండ్ను ఎంచుకుంటే ఐదు నిమిషాల సేపు ఫోన్ రింగ్ అవుతుంది. సైలెంట్ మోడ్లో ఉన్నా, స్విఛాప్ అయినా కూడా ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ దొరికినవారిని హెచ్చరించేందుకు మెసేజ్ కూడా పంపించొచ్చు. స్క్రీన్ లాక్ అయినా వారికి మెసేజ్ కనిపిస్తుంది. ఫోన్ను లాక్ చేయాలనుకుంటే ‘సెక్యూర్ డివైస్’ మీద క్లిక్ చేసి, గూగుల్ ఖాతా నుంచి సైన్ అవుట్ కావాలి. ఇక ‘ఎరేజ్ డివైస్’ ఆప్షన్తో ఫోన్లోని సమాచారాన్నంతా డిలిట్ చేయొచ్చు. ఇందుకోసం మళ్లీ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఒకసారి సమాచారం ఎరేజ్ అయితే ఇక ఎప్పటికీ ఫోన్ ఎక్కడున్నదీ గుర్తించలేం. ఒకవేళ కంప్యూటర్ అందుబాటులోకి లేకపోతే ఇతర ఆండ్రాయిడ్ పరికరంతోనూ ఫైండ్ మై డివైస్ యాప్లోకి సైన్ఇన్ అయ్యి కూడా ఫోన్ ఉన్న చోటును గుర్తించొచ్చు.
- సామ్సంగ్ గెలాక్సీ వంటి కొన్ని ఫోన్లలో ఫైండ్ మై డివైస్తో పాటు అదనంగా ఫైండ్ మై మొబైల్ ఆప్షన్ సైతం ఉంటుంది.
గూగుల్తో యాప్స్ ధ్రువీకరణ
గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న అన్ని యాప్లను గూగుల్ తనిఖీ చేస్తుంది, ధ్రువీకరిస్తుంది. అయితే కొన్నిసార్లు అధికార స్టోర్ల నుంచి కాకుండా ఇతర సోర్స్ నుంచి యాప్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. ఇలాంటప్పుడు యాప్ వెరిఫికేషన్ను ఆన్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసుకునే యాప్లను స్కాన్ చేస్తుంది. వాటిల్లో మాల్వేర్లుంటే హెచ్చరిస్తుంది. ఇందుకోసం సెటింగ్స్ ద్వారా సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లి స్కాన్ డివైస్ ఫర్ సెక్యూరిటీ థ్రెట్స్ను ఎనేబుల్ చేసుకోవాలి.
సెక్యూరిటీ యాప్ ఇన్స్టాల్
సహజంగానే ఆండ్రాయిడ్ పరికరాల్లో బోలెడన్ని సెక్యూరిటీ టూల్స్ ఉంటాయి. అయినప్పటికీ థర్డ్ పార్టీ సెక్యూరిటీ లేదా యాంటీవైరస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవటం మంచిది. అయితే 360 సెక్యూరిటీ, అవాస్ట్ యాంటీవైరస్ అండ్ సెక్యూరిటీ, లుకవుట్ మొబైల్ సెక్యూరిటీ వంటి విశ్వసనీయ యాప్లనే ఎంచుకోవాలని మరవొద్దు. ఇలాంటి భద్రమైన యాప్లు వైరస్లు, మాల్వేర్లను స్కాన్ చేయటమే కాకుండా అంతర్జాలాన్ని చూస్తున్నప్పుడు బ్రౌజర్లనూ స్కాన్ చేస్తాయి. టూల్స్ వేగాన్నీ పెంచుతాయి. బాగా పనిచేసే సెక్యూరిటీ యాప్ను ఎంచుకొని, ఇన్స్టాల్ చేసుకోవాలి.
డేటా ఎన్క్రిప్షన్
పరికరంలో డేటాను ఎన్క్రిప్షన్ చేసుకుంటే ఫోన్ లేదా ట్యాబ్లెట్ను ఎవరైనా దొంగిలించినా భద్రంగా కాపాడుకోవచ్చు. ఇది డేటాను ఇతరులు చదవటానికి వీల్లేని రహస్యలిపిలోకి మార్చేస్తుంది. పాస్వర్డ్లాంటి విశ్వసనీయ మార్గాలతో తప్ప వాటిని చదవటానికి, చూడటానికి వీలుండదు. ఖాతా, యాప్ వివరాలు, మ్యూజిక్, ఇతర మీడియా, డౌన్లోడ్ సమాచారం వంటి ఆండ్రాయిడ్ పరికరంలోని మొత్తం డేటాను ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. సెటింగ్స్లోని సెక్యూరిటీ మెనూ ద్వారా ఎన్క్రిప్షన్ మోడ్ను జతచేసుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ చేసుకోవటం కొన్ని ఫోన్లలో వేరేగా ఉండొచ్చు.
తరచూ బ్యాకప్
ఆండ్రాయిడ్ సెక్యూరిటీ సెటప్లో భాగంగా తరచూ బ్యాకప్ చేసుకోవటం కీలకమైన విషయం. ఎప్పుడో చేసుకున్న బ్యాకప్లు పరికరానికి పూర్తి భద్రత కల్పించలేవు. ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోకపోతే రికవర్ చేసుకునే సమయంలో కొంత సమాచారాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఆటోమేటిక్ బ్యాకప్ ఫీచర్తో దీన్ని తేలికగానే సెట్ చేసుకోవచ్చు. సెటింగ్స్లోకి వెళ్లి, బ్యాకప్ మై అకౌంట్ను ఎంచుకుంటే చాలు.
అన్సెక్యూర్డ్ నెట్వర్క్ల వాడొద్దు
ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసనీయం కాని నెట్వర్క్లకు కనెక్ట్ కావొద్దు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లతో వ్యాపారం చేసేవారికిది మరింత ముఖ్యం. హోటళ్ల వంటి చోట్ల తరచూ పనిచేసేవారు ఇంటర్నెట్కు కనెక్ట్ కావాల్సి వస్తే పాస్వర్డ్తో కూడిన నెట్వర్క్లనే ఎంచుకోవాలి. పాస్వర్డ్లు లేని వై-ఫైతో కనెక్ట్ అయితే రహస్య సమాచారాన్ని పంపటం, అందుకోవటం చేయొద్దు.తెరకు తాళం అన్నింటికన్నా ముందుగా సెట్ చేసుకోవాల్సింది స్క్రీన్ లాక్. ఇంటికి తాళం వేసినట్టుగా తెరను లాక్ చేసుకుంటే ఇతరులెవరూ తెరవటానికి వీలుండదు. ప్యాటర్న్, పిన్ దేనితోనైనా స్క్రీన్ లాక్ చేసుకోవచ్చు. పిన్తో లాక్ చేసుకోవటం సురక్షితమైన పద్ధతే గానీ ప్యాటర్న్తోనైతే త్వరగా ఫోన్ను అన్లాక్ చేయొచ్చు. దీన్ని గుర్తుంచుకోవటమూ తేలికే. అయితే ఇతరులెవరూ ఊహించలేని సంక్లిష్టమైన ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి. అధునాతన ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్లు ఇప్పుడు ఫోన్ను సెట్ చేసుకోవటానికి ముందే స్క్రీన్ లాక్ను సూచిస్తున్నాయి కూడా. కాబట్టి దీన్ని సమర్థవంతంగా వాడుకుంటే ఫోన్ భద్రత విషయంలో తొలి అడుగు పడినట్టే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వచ్ఛ ఒలింపిక్స్
ఒలింపిక్ క్రీడలకు పారిస్ నగరం సమాయత్తమైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, క్రీడాభిమానులతో విశ్వ నగరం కొత్త శోభలు సంతరించుకుంటోంది. -
వినూత్న ఫొటోనిక్స్
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలక్ట్రాన్ల పాత్ర కీలకం. ఇవి ఒక చోటు నుంచి మరో చోటుకు డేటాను చేరవేయటం వంటి దగ్గరి దారులకు బాగా ఉపయోగపడతాయి. -
1పాస్వర్డ్ మారింది
పలు కొత ఫీచర్లతో 1పాస్వర్డ్ భారీగా అప్డేట్ అయ్యింది. మాస్టర్ పాస్వర్డ్ను మరిచిపోయినా అకౌంట్ను రికవరీ చేసుకునే వెలుసుబాటూ కల్పించింది. -
నవ్వు శాస్త్రం
నవ్వటం ఒక భోగం! అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నవ్వటమనేది కనుమరుగవుతోంది. రోజుకు ఒక్కసారైనా నవ్వనివారు ఎందరో. -
ఎక్కువ సిమ్లు తీసుకున్నారా?
నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక్క సిమ్ కార్డు సరిపోవటం లేదు. ఆఫీసు వ్యవహారాలకు ఒకటి, సొంత పనులకు ఒకటి, కుటుంబ పనులకు మరోటి.. ఇలా బోలెడన్ని సిమ్లు ఎడాపెడా తీసేసుకుంటున్నారు. -
ఆన్లైన్ నేరాల మీద చక్షువు
నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. -
మనిషిలా మరమనుషులు!
విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటారు. ఇవి రోజురోజుకీ ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే.. మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు. -
సూపర్ పరిజ్ఞానాలు
సాంకేతిక పరిజ్ఞాన (టెక్నాలజీ) రంగం శరవేగంగా సాగుతోంది. నిన్నటి పద్ధతులు నేడు పాత పడిపోతున్నాయి. వాటి స్థానంలో వినూత్న పరిజ్ఞానాలు వచ్చి చేరుతున్నాయి. -
ఏఐ సాయంతో ఉద్యోగం!
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందని, దీని మూలంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వెల్లువెత్తటం చూస్తున్నదే. -
ఏఐ సోషల్ లోకం!
సామాజిక మాధ్యమ ప్రియులకు శుభవార్త. మరో వినూత్న సోషల్ మీడియా యాప్ ఆరంభమైంది. దీని పేరు బటర్ఫ్లయిస్. మామూలు యూజర్లతోనే కాకుండా కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించుకున్న పాత్రలతోనూ సంభాషణలు జరపటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. -
గ్రహాంతర జీవులు మనమధ్యే!
గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలాకాలంగా అన్వేషిస్తున్నాం. కానీ ఇంతవరకూ కచ్చితమైన జాడేదీ కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్లు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. -
విద్యుత్తు మోటారు ఎలా తిరుగుతుంది?
విద్యుత్తుతో పనిచేసే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజూ వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి. -
యాపిల్ ఏఐ శకం
యాపిల్ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) దిశగా తొలి అడుగులు వేసింది. ఏటా నిర్వహించే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈసారి దీనికి పెద్ద పీట వేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరిట సొంత ఏఐ పరిజ్ఞానాన్ని పరిచయం చేయటంతో పాటు డిజిటల్ అసిస్టెంట్ అయిన సిరికి సైతం ఏఐ సొబగులు అద్దింది. -
నవ మాయా దర్పణం
మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలక బోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో. -
పదార్థాలు చెడకుండా..
ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి. -
ఫైళ్ల అంశాలు ప్రివ్యూలో
డెస్క్టాపో, ల్యాప్టాపో.. ఏదైనా పీసీలో బోలెడన్ని ఫైళ్లు. రోజూ కొత్తవి ఎన్నో వచ్చి చేరుతుంటాయి. కొన్నిసార్లు పేర్లనూ మరచిపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు. -
వాతావరణ మార్పును వింటారా?
డేటా అనగానే అంకెలు, గ్రాఫ్లే గుర్తుకొస్తాయి. దీన్ని సంగీతంగా మారిస్తే? జపాన్ శాస్త్రవేత్త హిటోరీ నగాయ్ అలాంటి విచిత్రమే చేసి చూపించారు. అర్కిటిక్, అంటార్కిటికా నుంచి 30 ఏళ్లుగా ఉపగ్రహాలు సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఆరు నిమిషాల పాటగా మార్చారు. -
కార్చిచ్చు కహానీ!
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. -
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM