NPDCL CMD Varun Reddy: సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్
కొత్త కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు
తొలుత పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల్లో ఏర్పాటు
పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణతో నష్టాలను తగ్గిస్తాం
‘ఈనాడు’తో ఉత్తర డిస్కం సీఎండీ వరుణ్రెడ్డి

ఈనాడు, హైదరాబాద్: స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులు తమ సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని... నెలవారీ బిల్లు పెరగకుండా పొదుపు పాటించడానికి అవకాశం ఏర్పడుతుందని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించి... ‘సరఫరా, పంపిణీ’(టీడీ)లో నష్టాలను తగ్గించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సంస్థల పనితీరు, పంపిణీ వ్యవస్థలో సమస్యలు, ప్రభుత్వపరంగా చేపడుతున్న సంస్కరణలు తదితర అంశాలను ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...
‘పీఎం సూర్యఘర్’ పథకంలో తెలంగాణ వెనుకబడటానికి ఇళ్లపై సౌరవిద్యుత్ ఏర్పాటును డిస్కంలు ప్రోత్సహించకపోవడమే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి...?
ఇందులో వాస్తవం లేదు. రాష్ట్రంలోని గృహావసర కనెక్షన్లలో 80% వరకు నెలకు 200 యూనిట్లలోపే కరెంటు వినియోగిస్తున్నారు. ఈ వినియోగదారుల్లో ఎక్కువ మంది గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్నారు. రూ.లక్ష వరకు ఖర్చుతో రూఫ్టాప్ సోలార్ పలకల ఏర్పాటుకు వీరు విముఖత చూపుతున్నారు. రూఫ్టాప్ సోలార్ ఏర్పాటు చేసుకుంటే రాయితీ వస్తుందని, కరెంటు బిల్లు తగ్గుతుందంటూ గృహజ్యోతి పరిధిలో లేని వినియోగదారులకు సెల్ఫోన్ సందేశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి కనబరిచేవారికి ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా రూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు సహకరిస్తున్నాం.
ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని గతంలో ఈఆర్సీ ఆదేశించింది. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు...?
పరిశ్రమలు, వాణిజ్య సంస్థల కేటగిరీల్లో కరెంటు వినియోగం భారీగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం వాటికి ఇచ్చే కొత్త కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తప్పనిసరి చేశాం. ఈ మీటర్లలోనే ప్రీపెయిడ్ ఆప్షన్ ఉంటుంది. గృహావసరాలకు దశలవారీగా ఏర్పాటు చేస్తాం. ప్రీపెయిడ్ మీటర్లతో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు పలు రాష్ట్రాల విద్యుత్ అధికారులు చెబుతున్నారు. రీఛార్జి సొమ్ము వరకు కరెంటు వాడుకున్న తర్వాత సరఫరా నిలిచిపోతుంది. తిరిగి రీఛార్జి చేసుకున్నాకే సరఫరా ప్రారంభమవుతుంది. ఇలాంటి సాంకేతిక సమస్యలను పరిశీలించి... ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. నెలకు 500 యూనిట్లకుపైగా వినియోగించుకునేవారు కోరితే ఏర్పాటు చేస్తాం.
కాలం చెల్లిన పరికరాలు, సామగ్రి వల్లనే విద్యుత్ పంపిణీలో 10 శాతానికిపైగా నష్టాలు వస్తున్నాయన్నది నిజమా...?
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి విద్యుత్ పంపిణీ వ్యవస్థ పరికరాలు, సామగ్రి మార్చేయడం సాధ్యం కాదు. ఒకే ఫీడర్లో మొత్తం పరికరాలు, సామగ్రి మార్చాలంటే 10-15 సార్లు కొన్ని గంటలసేపు సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు ఈ ఏడాది రెండు డిస్కంల పరిధిలో రూ.4 వేల కోట్ల వరకు వెచ్చించాలనే ప్రణాళికలున్నాయి. ఉత్తర డిస్కం పరిధిలో రూ.450 కోట్లతో పనులు చేపడుతున్నాం.
ఉత్తర డిస్కం పరిధిలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయెందుకు?
బొగ్గు ధరలు పెరుగుతుండటంతో కరెంటు కొనుగోలు వ్యయం అధికంగా ఉంది. పంపిణీ, సరఫరాలో నష్టాలను గణనీయంగా తగ్గించడానికి పెద్దఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నాం. సిబ్బందితో కలసి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను, లైన్లను పరిశీలిస్తున్నాను. ఏదైనా ఫీడర్ పరిధిలో బిల్లులు, రీడింగ్లో తేడాలు అధికంగా ఉంటే ఇంజినీర్లను తనిఖీలకు పంపుతున్నాను.
కొత్త డిస్కం ఏర్పాటుతో ప్రయోజనాలేంటి?
రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా, ఎత్తిపోతల పథకాలు వంటివి తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మూడో డిస్కం ఏర్పాటుతో ప్రస్తుతమున్న రెండు డిస్కంలకు నష్టాలు తగ్గి.. ఆర్థికంగా మేలు జరుగుతుందని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

జూబ్లీ‘త్రి’ల్స్
జూబ్లీహిల్స్... ఈ ఉప ఎన్నికలో గెలుపు.. మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. - 
                                    
                                        

100 మంది ఓటర్లకో నేత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతి వందమంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. - 
                                    
                                        

పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు
హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. - 
                                    
                                        

చదువులో వెనకబాటుకు పిల్లల్ని నిందించలేం
చదువులో కొంత వెనకబడగానే ఆ పిల్లలకు ఆసక్తి లేదని... చదువు రాదని... ఒక ముద్ర వేసి... వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు... అలాంటి వారికి మరికొంత సమయం కేటాయిస్తే మిగిలిన వారితో సమానంగా రాణిస్తారని చెబుతున్నారు దిల్లీ విశ్వవిద్యాలయం విద్యా విభాగం మాజీ డీన్, విద్యావేత్త ఆచార్య అనితా రాంపాల్. - 
                                    
                                        

పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే గుత్తేదారులకు భారీ జరిమానా
జాతీయ రహదారులపై పదే పదే ప్రమాదాలు జరుగుతున్నట్లయితే ఆ ప్రాంతంలో పనులు చేసిన గుత్తేదారులకు భారీ జరిమానాలు విధించాలని ‘కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ’ నిర్ణయించింది. - 
                                    
                                        

ధైర్యముంటే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయండి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి హద్దులు దాటి మాట్లాడుతున్నారని... కాంగ్రెస్కు ఓటేయకపోతే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేస్తామని బెదిరించారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. - 
                                    
                                        

విద్యాశాఖలోనూ హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్
పోలీస్ శాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది... ప్రభుత్వ జూనియర్ కళాశాలల పర్యవేక్షణకు ఇంటర్ బోర్డులోనూ ఏర్పాటు చేశారు... అదే కోవలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీసి, తగిన చర్యలు తీసుకునేందుకు హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. - 
                                    
                                        

జీఎస్టీకి ‘పండగ’.. ఆదాయం మెండుగా..!
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబ్ల సవరణతో ఆదాయం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఆందోళన చెందినా గత నెలలో పండగలు ఆదుకున్నాయి. - 
                                    
                                        

నేటి నుంచి ఇంజినీరింగ్ కళాశాలల బంద్
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు సోమవారం నుంచి నిరవధిక బంద్ను పాటించనున్నాయి. - 
                                    
                                        

భారత రాష్ట్ర సమితి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
భద్రాద్రి జిల్లా మణుగూరులో కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(7)
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తోంది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ
 - 
                        
                            

విజయవాడ ఆస్పత్రి వద్ద జోగి రమేశ్ అనుచరుల హంగామా
 - 
                        
                            

సచిన్ వినయం, మానవత్వం ప్రత్యక్షంగా చూశా: మంత్రి నారా లోకేశ్
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/11/2025)
 - 
                        
                            

‘బిగ్బాస్-9’ నుంచి మాధురి ఎలిమినేట్.. అతడికి హౌస్లో ఉండే అర్హత లేదంటూ కామెంట్
 - 
                        
                            

కాశీలో దేవ్ దీపావళి.. 10లక్షల దీపాలతో ఏర్పాట్లు!
 


