పాలమూరు భూసేకరణపై దృష్టిసారించండి: రజత్‌కుమార్‌

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ బుధవారం

Updated : 17 Jun 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో భూసేకరణ సమస్యలను ఈ సమావేశంలో గుత్తేదారులు ప్రస్తావించారని తెలిసింది. దీంతో రజత్‌కుమార్‌ ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు ఫోన్‌ చేసి భూసేకరణపై దృష్టిసారించాలని సూచించారు. త్వరలో ప్రాజెక్టు ముఖ్య ఇంజినీర్లు, ఎస్‌ఈలతో కలెక్టర్లు సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని