శిరిడీ సాయిబాబాకు రూ.2 కోట్ల బంగారు పట్టీ

మహారాష్ట్రలోని ప్రసిద్ధ శిరిడీ సాయిబాబా ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడొకరు రూ.2 కోట్ల విలువైన బంగారు పట్టీ(గోల్డ్‌ బ్యాండ్‌)ని విరాళంగా అందజేశారు.

Published : 19 May 2022 05:27 IST

హైదరాబాద్‌ భక్తుడి విరాళం

శిరిడీ: మహారాష్ట్రలోని ప్రసిద్ధ శిరిడీ సాయిబాబా ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడొకరు రూ.2 కోట్ల విలువైన బంగారు పట్టీ(గోల్డ్‌ బ్యాండ్‌)ని విరాళంగా అందజేశారు. పార్థసారథిరెడ్డి అనే భక్తుడు 4 కిలోల బంగారంతో తయారుచేసిన పట్టీని అందజేసినట్లు ఆ ఆలయ ట్రస్ట్‌ సీఈవో భాగ్యశ్రీ బుధవారం తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు 2007లో 94 కిలోల స్వర్ణ సింహాసనాన్ని ట్రస్ట్‌కు అందజేసినట్లు ఈ సందర్భంగా భాగ్యశ్రీ గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని