Pathipaka Mohan: పత్తిపాక మోహన్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ కవి, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకుడు, సిరిసిల్ల వాసి డా.పత్తిపాక మోహన్.. ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన యువ కవి, తెలుగు ఉపాధ్యాయుడు పళ్లిపట్టు నాగరాజు కేంద్ర సాహిత్య అకాడమీ-2022 బాల, యువ పురస్కారాలకు ఎంపికయ్యారు.
‘బాలల తాతా బాపూజీ’ కవితా సంకలనానికి బాల పురస్కారం
పళ్లిపట్టు నాగరాజుకు యువ పురస్కారం
ఈనాడు, దిల్లీ: ప్రముఖ కవి, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకుడు, సిరిసిల్ల వాసి డా.పత్తిపాక మోహన్.. ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన యువ కవి, తెలుగు ఉపాధ్యాయుడు పళ్లిపట్టు నాగరాజు కేంద్ర సాహిత్య అకాడమీ-2022 బాల, యువ పురస్కారాలకు ఎంపికయ్యారు. మోహన్ ‘‘బాలల తాతా బాపూజీ’’, నాగరాజు ‘‘యాలై పూడ్సింది’’ కవితా సంకలనాలను అకాడమీ అవార్డులు వరించాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వెలువడిన కవితా సంపుటాలు, చిట్టికథలు, నవలలు, వ్యాస సంపుటాలు, వ్యంగ్య రచనలకు అకాడమీ 2022కి బాల, యువ పురస్కారాలను ప్రకటించింది. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా నేతృత్వంలో దిల్లీలో బుధవారం సమావేశమైన సభ్యులు.. 22 భాషలకు సంబంధించి జ్యూరీ ఎంపిక చేసిన రచనలకు పురస్కారాలను ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన కవులు/రచయితలకు నవంబరు 14న దిల్లీలో నిర్వహించే వేడుకలో రూ.50వేల చెక్కు, తామ్ర ఫలకం అందజేస్తారు.
ఎన్నెన్నో సంకలనాలకు వన్నెలు..
పిల్లల కోసం మన కవులు, సహస్ర భాగవత సప్తాహదీప్తి, చందమామ రావె, వెన్నముద్దలు, ఆకుపచ్చని పాట, ఒక్కేసి పువ్వేసి చందమామ, అఆ ఇఈ తదితర కథలతో పాటు.. 14 బాల సాహిత్య సంకలనాలు, 28 బాలసాహిత్య అనువాదాలు, ఖడ్గధార, సముద్రం తదితర రచనలు సహా పలు సంకలనాలకు మోహన్ సంపాదకత్వం వహించారు. సిరిసిల్లకు చెందిన మోహన్ 1972, జనవరి 5న చందుర్తి మండలం లింగంపేటలో గంగాబాయి, లక్ష్మీరాజం దంపతులకు జన్మించారు. వీరిది చేనేత కుటుంబం. ఈ నేపథ్యంలోనే కవిత్వం రాశారు. ఈయనకు తొలి గురువు ఆచలయోగి, తాత పత్తిపాక శంకరయ్య ప్రభావం తొలి నుంచీ ఉంది. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్డీ చేశారు. ‘తెలుగులో గజల్ ప్రక్రియ-సమగ్ర పరిశీలన’ పేరుతో ఆ పంథాలో తొలి పరిశోధన చేశారు. మానేరు రచయితల సంఘం వ్యవస్థాపకుడిగా సాహితీ సేవ చేశారు. 1997లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొదటి యువ విశిష్ట సాహిత్య పురస్కారంతో పాటు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాహిత్య పురస్కారం-2017 వంటి అవార్డులను అందుకున్నారు. 2022 కేంద్ర సాహిత్య బాల పురస్కారం పోటీలో పలువురు ప్రముఖుల రచనలు నిలిచినా జ్యూరీ ఏకగ్రీవంగా ‘‘బాలల తాతా బాపూజీ’’ని ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యులుగా బెలగం భీమేశ్వరరావు, డాక్టర్ ఎన్.గోపి, చొక్కాపు వెంకటరమణ వ్యవహరించారు. మోహన్ సతీమణి సిరిసిల్ల చందన ఎస్సీఈఆర్టీలో హిందీ భాషా నిపుణురాలిగా ఉన్నారు.
రాష్ట్రానికి గర్వకారణం: సీఎం కేసీఆర్
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి మోహన్ ఎంపిక కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రానికి గర్వకారణమన్నారు. గాంధీజీపై రాసిన బాల సాహిత్యానికి తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దక్కడం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు. కీర్తిశేషులు డాక్టర్ సి.నారాయణరెడ్డి శిష్యుడైన మోహన్.. సాహితీ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణకు వన్నె తేవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
‘‘జోతలివే అందుకొనుము గాంధీతాత
భరతజాతికంతటికి స్ఫూర్తిప్రదాత
శిరమెత్తిన స్వేచ్ఛకు నీ పిలక ప్రతీక
నీ బోసినవ్వే కదా భరతజాతి జ్ఞాపిక
సబర్మతి మౌనివి.. సహకార జ్యోతివి
శాంతియుద్ధ వీరునివి, సత్యధర్మ మార్గానివి’’... అంటూ మహాత్ముడిని వర్ణిస్తూ పత్తిపాక మోహన్ బాలల కోసం గుదిగుచ్చిన కవితా సంకలనమే ‘‘బాలల తాతా బాపూజీ’’. రెండు భాగాలు కలిగిన ఈ పుస్తకంలో తొలి భాగం గాంధీ గేయాలతో, రెండోది గాంధీ గేయ కథతో ఉంటుంది. చిరుప్రాయంలో గాంధీ చూపిన గాంధేయవాదం, ఆయన తత్వం, వ్యక్తిత్వం, జాతీయోద్యమాన్ని మహాత్ముడు ముందుండి నడిపిన తీరును పిల్లల మనసుకు హత్తుకునేలా మోహన్ రచించారు.
నాయకులను నిలదీసేలా...
‘‘యాలై పూడుస్తా ఉంది.. ఎంతకాలమీ ఏగులాట...
కొన్నాలికలో బెల్లం పూసుకొని... అంగిట్లో విషం బెట్టుకొని
భలే మాట్లాడుతుండారు కదబ్బ... భలే బెలిపిస్తుండారు కదయ్యా..
కాళ్లు తిమ్మిరెక్కేలా పిల్లకాయలను కూచోబెట్టి నీతి కోతలు కోస్తా ఉండారే...
ఇంగిలీసోడు ఎలబారి ఏళ్లు గడిచినా దుమ్మెత్తి పోస్తున్నారేగానీ...
దేశంలోపల దొరల సంగతేంది.. దేశం వదిలిపోతున్న దొంగల సంగతేంది
సెలవిస్తారా స్వామి’’.. అంటూ నాయకులను నిలదీసేలా ‘యాలై పూడ్సింది’ కవిత సాగుతుంది. దేశ కాలమాన పరిస్థితులను కళ్లకు కడుతూ 56 కవితలతో ఈ సంకలనాన్ని పళ్లిపట్టు నాగరాజు 2020 డిసెంబరులో వెలువరించారు. అది ఆయన తొలి వచన కవితా సంపుటి.
తెలుగు చదివి.. వెలుగులీని
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రంగనాథపురం మిట్టిండ్లు గ్రామంలో 1987, మే 22న నాగరాజు జన్మించారు. తల్లిదండ్రులు భూలక్ష్మి, రాఘవయ్య. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ(తెలుగు) చదివిన నాగరాజు 2016లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శాంతిపురం మండలం 64 పెద్దూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధిస్తున్నారు. రెక్కలు(మినీ కవితలు), మమ్మీ అమ్మ కావాలి, మనసుపొరల్లో వంటి కథలు, పలు కవితలను ఆయన రాశారు. నాగరాజు కవితలు కన్నడ, ఆంగ్లభాషల్లోకి ఎక్కువగా అనువాదమయ్యాయి. కవిగా ఆయన కలహంస పురస్కారం, డాక్టర్ రాధేయ కవితా పురస్కారం, వింజమూరి-కవిసంధ్య కవితల పోటీ పురస్కారం, తెలుగు సాహిత్య సంస్కృతి సమితి పురస్కారం, తెలుగు రక్షణవేదిక భాషా సేవక పురస్కారంతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. 2022 కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి అనేక రచనలు పోటీ పడినా జ్యూరీ ఏకగీవ్రంగా ‘యాలై పూడ్సింది’ని ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యులుగా ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి, డా.పెన్నా శివరామకృష్ణ వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!