YS Sharmila: ఏడేళ్లుగా కేసీఆర్ ఆడిందే ఆట
‘‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమం చూసి మురిసిపోతున్న కేసీఆర్ పాలనను అంతం చేయడానికే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టా. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి సొంత జేబులు నింపుకొంటున్నారు. నిరుద్యోగుల ఆశలు చిదిమేసి వారిని ఆత్మహత్యల దిశగా పురిగొల్పుతున్నారు.
తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
చేవెళ్ల సభలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలు
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: ‘‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమం చూసి మురిసిపోతున్న కేసీఆర్ పాలనను అంతం చేయడానికే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టా. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి సొంత జేబులు నింపుకొంటున్నారు. నిరుద్యోగుల ఆశలు చిదిమేసి వారిని ఆత్మహత్యల దిశగా పురిగొల్పుతున్నారు. ఈ విధంగా సాగుతున్న కేసీఆర్ కుటుంబ పాలనను సమాప్తం చేయడానికే పాదయాత్ర చేస్తున్నా’’ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్య్ఖక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పేరిట బుధవారం చేవెళ్ల నుంచి ఆమె చేపట్టిన పాదయాత్రను తల్లి విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. ‘‘సరిగ్గా 18 ఏళ్ల కిందట సంక్షేమ పాలనకు పునాదులు వేసేలా వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. నా పాదయాత్రతో ప్రతి ఇంటి తలుపు తట్టి, కష్టాలు విని.. వాటిని తీర్చేలా పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రతిపక్షాల చేతకానితనాన్ని నిలదీస్తాం. వైఎస్ సంక్షేమ పాలనను తిరిగి తెస్తాం. సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి.. మన పార్టీ లక్ష్యాలు’’ అని వివరించారు.
భాజపాను గంగలో ముంచుతా..కాంగ్రెస్ను చీల్చి చెండాడుతా..
‘‘ఈ ఏడేళ్లలో కేసీఆర్ను ప్రశ్నించే వారు లేరు కనుకే ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. దమ్ముంటే నాతోపాటు మీరూ(కేసీఆర్) పాదయాత్రకు రండి. సమస్యలు లేవు, పాలన అద్భుతమంటున్నారు కదా! నిజంగానే సమస్యలు లేవని నిరూపిస్తే నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్లిపోతా. ఒకవేళ సమస్యలు ఉంటే మీరు రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా? మీ పాలన మీద నమ్మకం ఉంటే నా సవాల్ను స్వీకరించాలి. మీరు దేశంలో అధ్వానమైన సీఎం అని తాజాగా ఓ సర్వేలో తేలింది. మీకు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ఆలోచన లేదు. మీరు సీఎం అయ్యాక 300 శాతం మద్యం అమ్మకాలు పెరిగితే.. అదే స్థాయిలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. మీ పాలనలో ఆరేళ్ల పసిపాపకూ రక్షణ లేదంటే ఏమనుకోవాలి’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న భాజపాను గంగలో ముంచడానికి.. కేసీఆర్కు అమ్ముడుపోయి తెరాసకు వంత పాడుతున్న కాంగ్రెస్ను చీల్చి చెండాడటానికే యాత్ర చేపట్టా. రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. ఆయనకు విశ్వసనీయత ఉందో.. మాకు ఉందో ప్రజలే తేలుస్తారు’’ అని షర్మిల ధ్వజమెత్తారు.
మీ ఇజ్జత్ కాపాడే అస్త్రం షర్మిల: విజయమ్మ
వైఎస్ ఆశయాల సాధన కోసమే షర్మిల ప్రజల వద్దకు వస్తోందని విజయమ్మ అన్నారు. గతంలో ఆమె 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నో కష్టాలు పడిందని అన్నారు. మీ ఇజ్జత్ కాపాడే అస్త్రంగా షర్మిలమ్మ వస్తోందన్నారు. కార్యక్రమంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్, వైతెపా ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, అధికార ప్రతినిధులు తూడి దేవేందర్రెడ్డి, పిట్టం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు చేవెళ్ల పట్టణంలో ప్రారంభమైన యాత్ర.. దాదాపు తొమ్మిది కిలోమీటర్లు సాగింది. రాత్రి కందవాడ-నక్కలపల్లి మధ్యలో బస చేశారు. గురువారం నక్కలపల్లి నుంచి శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ కాలేజీ వరకు సాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM